అగ్ర దర్శకులు మాములుగా ఎంత ఒత్తిడిలో ఉంటారో చూస్తుంటాం. అందుకే రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఒక సమయంలో ఒక పని మీదే ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం దీనికి భిన్నంగా ఒకపక్క పుష్ప లాంటి ప్యాన్ ఇండియాలు చేస్తూనే మరోపక్క కుర్ర హీరోలతో తక్కువ బడ్జెట్ సినిమాలకు కథలు డైలాగులు అందిస్తూ తన కలానికి విపరీతమైన పని పెట్టేస్తున్నారు. నిన్న ప్రకటించిన సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీకి రచన సుక్కు అని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఏడాదికి పైగా పుష్ప 2 మీద పని చేస్తున్న ఈయనకు అంత తీరిక ఎక్కడ దొరికిందబ్బా అనే సందేహం వచ్చింది.
మొన్న డిసెంబర్ లో రిలీజైన నిఖిల్ 18 పేజెస్ కు పెన్ను సపోర్ట్ సుకుమార్ దే. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన ట్రెండ్ కాదు. రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ అంత విజయం సాధించడంలో ఈయన మార్క్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్షన్ చేసింది శిష్యుడే అయినా తన ముద్ర కూడా ఉండేలా చూసుకోవడంతో పెద్ద హిట్టు కొట్టింది. ఆడలేదు కానీ దర్శకుడు అనే చిన్న సినిమా నిర్మాణం వెనుక ఉన్నది సుకుమార్. త్వరలో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్షకు స్క్రిప్ట్ చేసి ఇచ్చింది ఈ క్రియేటివ్ డైరెక్టరే. తన బృందాన్ని ఎప్పుడూ రైటింగ్ తో బిజీగా ఉంచే సుక్కు దానికి తగ్గ ఫలితాలే అందుకుంటారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎత్తుగడ. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఏళ్లకేళ్లు పడుతున్న ట్రెండ్ లో ఖాళీగా ఉన్న సమయంలో మీడియం బడ్జెట్ కు సరిపోయే కథలు రాసుకుని వాటిని అమ్మేసుకోవడం వల్ల ఇటు కాసులు అటు రచయితగా పేరు రెండూ వచ్చేస్తాయి. ఇవే కాదు ఇకపై కూడా యూత్ హీరోలతో ఇలాంటి కొనసాగించేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావొచ్చు. ఆపై రామ్ చరణ్ తో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్టు ఉంటుంది. ఇది పక్కాగా ఉంటుందా లేక ఆలస్యమవుతుందానేది 2024లోనే తేలేది
This post was last modified on February 8, 2023 1:13 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…