అగ్ర దర్శకులు మాములుగా ఎంత ఒత్తిడిలో ఉంటారో చూస్తుంటాం. అందుకే రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఒక సమయంలో ఒక పని మీదే ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం దీనికి భిన్నంగా ఒకపక్క పుష్ప లాంటి ప్యాన్ ఇండియాలు చేస్తూనే మరోపక్క కుర్ర హీరోలతో తక్కువ బడ్జెట్ సినిమాలకు కథలు డైలాగులు అందిస్తూ తన కలానికి విపరీతమైన పని పెట్టేస్తున్నారు. నిన్న ప్రకటించిన సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీకి రచన సుక్కు అని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఏడాదికి పైగా పుష్ప 2 మీద పని చేస్తున్న ఈయనకు అంత తీరిక ఎక్కడ దొరికిందబ్బా అనే సందేహం వచ్చింది.
మొన్న డిసెంబర్ లో రిలీజైన నిఖిల్ 18 పేజెస్ కు పెన్ను సపోర్ట్ సుకుమార్ దే. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన ట్రెండ్ కాదు. రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ అంత విజయం సాధించడంలో ఈయన మార్క్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్షన్ చేసింది శిష్యుడే అయినా తన ముద్ర కూడా ఉండేలా చూసుకోవడంతో పెద్ద హిట్టు కొట్టింది. ఆడలేదు కానీ దర్శకుడు అనే చిన్న సినిమా నిర్మాణం వెనుక ఉన్నది సుకుమార్. త్వరలో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్షకు స్క్రిప్ట్ చేసి ఇచ్చింది ఈ క్రియేటివ్ డైరెక్టరే. తన బృందాన్ని ఎప్పుడూ రైటింగ్ తో బిజీగా ఉంచే సుక్కు దానికి తగ్గ ఫలితాలే అందుకుంటారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎత్తుగడ. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఏళ్లకేళ్లు పడుతున్న ట్రెండ్ లో ఖాళీగా ఉన్న సమయంలో మీడియం బడ్జెట్ కు సరిపోయే కథలు రాసుకుని వాటిని అమ్మేసుకోవడం వల్ల ఇటు కాసులు అటు రచయితగా పేరు రెండూ వచ్చేస్తాయి. ఇవే కాదు ఇకపై కూడా యూత్ హీరోలతో ఇలాంటి కొనసాగించేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావొచ్చు. ఆపై రామ్ చరణ్ తో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్టు ఉంటుంది. ఇది పక్కాగా ఉంటుందా లేక ఆలస్యమవుతుందానేది 2024లోనే తేలేది
This post was last modified on February 8, 2023 1:13 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…