బాలీవుడ్ లో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోయే స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ దే అగ్ర స్థానం. గత ఏడాది మాములు డిజాస్టర్లు పడలేదు. సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, బచ్చన్ పాండే, రామ్ సేతు ఓ రేంజ్ లో దెబ్బ కొట్టాయి. థియేటర్ల నుంచి జనాలు పారిపోయే రేంజ్ లో భయపెట్టాయి. ఇక్కడ బెల్లంకొండ చేసిన రాక్షసుడు హిందీ రీమేక్ కట్ పుత్లీని తెలివిగా ఓటిటి రిలీజ్ చేశారు కాబట్టి బ్రతికిపోయింది కానీ లేదంటే దాని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. అందుకే అక్కి మీద సోషల్ మీడియాలో బోలెడు నెగటివిటీ కనిపిస్తుంది.
తాజాగా ఇతను మరో వివాదంలో చిక్కుకున్నాడు. అక్షయ్ కుమార్ త్వరలో నార్త్ అమెరికాలో ఒక టూర్ చేయబోతున్నాడు. దిశా పటాని, నోరా ఫతేహ్, మౌని రాయ్ తదితరులు పాల్గొనబోతున్నారు. దీని కోసం ఒక ప్రమోషనల్ వీడియో తయారు చేశారు. ప్రపంచ దేశాలను చూపించే గ్లోబ్ బొమ్మ మీద అక్షయ్ నడుచుకుంటూ రావడం అందులో ఉంది. షూస్ వేసుకున్న కాళ్లతో దేశ పటాల మీద అలా అవమాన పరిచే రీతిలో వాక్ చేయడమేంటని నెటిజెన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. పదే పదే దేశభక్తి గురించి లెక్చర్లు ఇచ్చే అక్షయ్ కుమార్ ఇదేనా కంట్రీ లవ్ అంటూ నిలదీస్తున్నారు.
దీన్ని మొన్న ట్వీట్ చేసిన అక్షయ్ ఇంత వివాదం రేగినా కూడా డిలీట్ చేయకుండా అలాగే ఉంచేశాడు. మార్చి 3న అట్లాంటాతో మొదలై మార్చ్ 11న ఓర్లాండోతో ఈ టూర్ ముగుస్తుంది. మొత్తం తొమ్మిది మంది స్టార్లు పాల్గొనబోతున్నారు. ఎంత ట్విట్టర్ లో వచ్చే వాటిని లైట్ తీసుకున్నా ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మళయాలం హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ సెల్ఫీ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈ డ్యామేజ్ ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. లేదంటే మళ్ళీ బాయ్ కాట్ నినాదాలు వచ్చాయంటే తలనెప్పే.
This post was last modified on February 7, 2023 4:55 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…