సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ కొంచెం డల్ అవుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంక్రాంతి వీకెండ్ తర్వాతి వారాంతంలో సినిమాలేవీ రిలీజ్ కాలేదు.
ఇక రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన ‘హంట్’ మూవీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ వీకెండ్లో మూడు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చాయి. అందులో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మైకేల్’ కొంచెం పెద్ద స్థాయి సినిమా.
ఇది కాక ‘రైటర్ పద్మభూషణ్’, ‘బుట్టుబొమ్మ’ అనే చిన్న సినిమాలు కూడా రిలీజయ్యాయి. ఐతే ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకును ఆకట్టుకున్నది ఒక్క చిత్రమే. అదే.. రైటర్ పద్మభూషణ్. మిగతా రెండు చిత్రాలకు నిరాశ తప్పలేదు.
ఈ వారం ‘మైకేల్’యే పెద్ద స్థాయి సినిమా అయినప్పటికీ.. దాంతో పోలిస్తే ‘రైటర్ పద్మభూషణ్’కే రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ ప్రమోషన్లు, ప్రోమోలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. రిలీజ్ ముందు రోజే ప్రిమియర్లు వేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది.
ఆ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక్కడి నుంచే టాక్ కూడా పాజిటివ్గా రావడంతో తొలి రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది థియేటర్లలో. ఈ సినిమా స్థాయికి మించి వీకెండ్లో వసూళ్లు రాబట్టింది. యుఎస్ ప్రేక్షకులు సైతం సినిమాను మెచ్చి బాగానే చూస్తున్నారు.
అక్కడ ఇప్పటికే 2 లక్షల డాలర్ల వసూళ్లు రావడం విశేషం. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 5 కోట్లకు పైగా గ్రాస్ వస్తున్నట్లు అంచనా. మరోవైపు లో బజ్తో రిలీజైన మైకేల్, బుట్టబొమ్మ సినిమాలకు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. మైకేల్ అయినా ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది కానీ.. బుట్టబొమ్మ మాత్రం దాదాపు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…