సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ కొంచెం డల్ అవుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంక్రాంతి వీకెండ్ తర్వాతి వారాంతంలో సినిమాలేవీ రిలీజ్ కాలేదు.
ఇక రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన ‘హంట్’ మూవీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ వీకెండ్లో మూడు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చాయి. అందులో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మైకేల్’ కొంచెం పెద్ద స్థాయి సినిమా.
ఇది కాక ‘రైటర్ పద్మభూషణ్’, ‘బుట్టుబొమ్మ’ అనే చిన్న సినిమాలు కూడా రిలీజయ్యాయి. ఐతే ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకును ఆకట్టుకున్నది ఒక్క చిత్రమే. అదే.. రైటర్ పద్మభూషణ్. మిగతా రెండు చిత్రాలకు నిరాశ తప్పలేదు.
ఈ వారం ‘మైకేల్’యే పెద్ద స్థాయి సినిమా అయినప్పటికీ.. దాంతో పోలిస్తే ‘రైటర్ పద్మభూషణ్’కే రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ ప్రమోషన్లు, ప్రోమోలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. రిలీజ్ ముందు రోజే ప్రిమియర్లు వేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది.
ఆ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక్కడి నుంచే టాక్ కూడా పాజిటివ్గా రావడంతో తొలి రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది థియేటర్లలో. ఈ సినిమా స్థాయికి మించి వీకెండ్లో వసూళ్లు రాబట్టింది. యుఎస్ ప్రేక్షకులు సైతం సినిమాను మెచ్చి బాగానే చూస్తున్నారు.
అక్కడ ఇప్పటికే 2 లక్షల డాలర్ల వసూళ్లు రావడం విశేషం. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 5 కోట్లకు పైగా గ్రాస్ వస్తున్నట్లు అంచనా. మరోవైపు లో బజ్తో రిలీజైన మైకేల్, బుట్టబొమ్మ సినిమాలకు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. మైకేల్ అయినా ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది కానీ.. బుట్టబొమ్మ మాత్రం దాదాపు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on February 6, 2023 7:56 am
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…
న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగం సభలో చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ, కూటమి పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న…