టాలీవుడ్ అనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే తమన్ ఎదుర్కొన్నంత సోషల్ మీడియా నెగెటివిటీని మరే సంగీత దర్శకుడూ ఎదుర్కొని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఒకే రకం పాటలిస్తాడని.. కాపీ కొడతాడని సోషల్ మీడియా ఊపు పెరగకముందు నుంచే అతను ట్రోలింగ్ ఎదుర్కొంటూ వచ్చాడు.
ఒక దశలో అది బాగా శ్రుతిమించింది కూడా. ఐతే మధ్యలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని మంచి మంచి ఆల్బమ్స్ ఇవ్వడం ద్వారా నెగెటివిటీని తగ్గించుకున్నాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈ మధ్య తమన్ మ్యూజిక్ మళ్లీ రొటీన్ అయిపోతున్నట్లు అనిపిస్తోంది. దీంతో మళ్లీ ట్రోలింగ్ తప్పట్లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అతను టార్గెట్గా మారిపోయాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే కొత్త సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వద్దంటూ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ గొడవ చేస్తున్నారు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాకు సరైన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదన్నది వారి ఆరోపణ. పైగా మహేష్ కొత్త సినిమా కోసం తమన్ రెడీ చేసిన ట్యూన్లను త్రివిక్రమ్ తిరస్కరించాడంటూ ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీంతో తమన్ను ఈ సినిమా నుంచి తప్పించాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ రోజంతా ట్రెండ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు లక్షల్లోకి వెళ్లిపోయాయి. ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండే తమన్ ఇదంతా గమనించకుండా ఏమీ లేడు.
తన గురించి పాజిటివ్గా ఉన్న ట్వీట్లను లైక్ చేయడమే కాక.. ఎందుకింత నెగెటివిటీ అంటూ ఒక చిన్న పోస్టు పెట్టాడు. నెగెటివిటీకి సమాధానంగా ఇదే తన క్రియేటివిటీ అంటూ ట్రోలర్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే మహేష్ ఫ్యాన్స్ అయితే తగ్గేలా కనిపించడం లేదు.
This post was last modified on February 4, 2023 10:29 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…