ఏదైనా కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు అలాంటిదే మన పోటీదారులు చేస్తున్నప్పుడు రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పోలిక దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మారిపోతుంది. అఖిల్ ఏజెంట్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28ని అఫీషియల్ గా నిన్న ప్రకటించాల్సి ఉంది. ఆ మేరకు ముందే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే కళాతపస్వి విశ్వనాథ్ గారు శివైక్యం చెందటంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. బహుశా రేపో మరికొద్ది రోజుల్లో అధికారికంగా చెబుతారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లానింగ్ చేస్తున్నారు.
దీనికి స్పైకి కనెక్షన్ ఏంటంటే రెండూ గూఢచారి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందటం. నిఖిల్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. తన కెరీర్ లోనే కార్తికేయ 2ని మించి అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. మల్టీ లాంగ్వేజెస్ లో రెడీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్పైని ఏప్రిల్ 14నే అంటే రెండు వారాల ముందే దించితే సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రేంజ్ బడ్జెట్ రెండూ ఒకటే కాకపోయినా కూడా ఆడియన్స్ పోల్చుకునే విషయంలో అలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోరు కాబట్టి వీలైనంత రిస్క్ తగ్గించుకోవడం ఎంతైనా అవసరం.
సో నిఖిల్ కోరుకున్నట్టు ముందు రావడం సాధ్యపడుతుందా లేదానేది రకరకాల క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేయాలి. అవతల ఏజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. శివరాత్రికి టీజర్ వదలొచ్చు. మొత్తానికి టాలీవుడ్ లో అడవి శేష్ గూఢచారి హిట్టయ్యాక మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలు చేశాక కొంత కాలం ఈ జానర్ ని ఎవరూ టచ్ చేయలేదు కానీ తిరిగి ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ ఈ బ్యాక్ డ్రాప్ ని కోరి మరీ చేస్తున్నారు.
This post was last modified on February 4, 2023 7:28 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…