ఏదైనా కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు అలాంటిదే మన పోటీదారులు చేస్తున్నప్పుడు రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పోలిక దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మారిపోతుంది. అఖిల్ ఏజెంట్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28ని అఫీషియల్ గా నిన్న ప్రకటించాల్సి ఉంది. ఆ మేరకు ముందే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే కళాతపస్వి విశ్వనాథ్ గారు శివైక్యం చెందటంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. బహుశా రేపో మరికొద్ది రోజుల్లో అధికారికంగా చెబుతారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లానింగ్ చేస్తున్నారు.
దీనికి స్పైకి కనెక్షన్ ఏంటంటే రెండూ గూఢచారి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందటం. నిఖిల్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. తన కెరీర్ లోనే కార్తికేయ 2ని మించి అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. మల్టీ లాంగ్వేజెస్ లో రెడీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్పైని ఏప్రిల్ 14నే అంటే రెండు వారాల ముందే దించితే సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రేంజ్ బడ్జెట్ రెండూ ఒకటే కాకపోయినా కూడా ఆడియన్స్ పోల్చుకునే విషయంలో అలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోరు కాబట్టి వీలైనంత రిస్క్ తగ్గించుకోవడం ఎంతైనా అవసరం.
సో నిఖిల్ కోరుకున్నట్టు ముందు రావడం సాధ్యపడుతుందా లేదానేది రకరకాల క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేయాలి. అవతల ఏజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. శివరాత్రికి టీజర్ వదలొచ్చు. మొత్తానికి టాలీవుడ్ లో అడవి శేష్ గూఢచారి హిట్టయ్యాక మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలు చేశాక కొంత కాలం ఈ జానర్ ని ఎవరూ టచ్ చేయలేదు కానీ తిరిగి ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ ఈ బ్యాక్ డ్రాప్ ని కోరి మరీ చేస్తున్నారు.
This post was last modified on February 4, 2023 7:28 am
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…