ఏదైనా కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు అలాంటిదే మన పోటీదారులు చేస్తున్నప్పుడు రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పోలిక దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మారిపోతుంది. అఖిల్ ఏజెంట్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28ని అఫీషియల్ గా నిన్న ప్రకటించాల్సి ఉంది. ఆ మేరకు ముందే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే కళాతపస్వి విశ్వనాథ్ గారు శివైక్యం చెందటంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. బహుశా రేపో మరికొద్ది రోజుల్లో అధికారికంగా చెబుతారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లానింగ్ చేస్తున్నారు.
దీనికి స్పైకి కనెక్షన్ ఏంటంటే రెండూ గూఢచారి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందటం. నిఖిల్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. తన కెరీర్ లోనే కార్తికేయ 2ని మించి అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. మల్టీ లాంగ్వేజెస్ లో రెడీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్పైని ఏప్రిల్ 14నే అంటే రెండు వారాల ముందే దించితే సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రేంజ్ బడ్జెట్ రెండూ ఒకటే కాకపోయినా కూడా ఆడియన్స్ పోల్చుకునే విషయంలో అలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోరు కాబట్టి వీలైనంత రిస్క్ తగ్గించుకోవడం ఎంతైనా అవసరం.
సో నిఖిల్ కోరుకున్నట్టు ముందు రావడం సాధ్యపడుతుందా లేదానేది రకరకాల క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేయాలి. అవతల ఏజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. శివరాత్రికి టీజర్ వదలొచ్చు. మొత్తానికి టాలీవుడ్ లో అడవి శేష్ గూఢచారి హిట్టయ్యాక మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలు చేశాక కొంత కాలం ఈ జానర్ ని ఎవరూ టచ్ చేయలేదు కానీ తిరిగి ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ ఈ బ్యాక్ డ్రాప్ ని కోరి మరీ చేస్తున్నారు.
This post was last modified on February 4, 2023 7:28 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…