నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వారం కిందట యువగళం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురై మృత్యు అంచులకు వెళ్లిన అతను.. తర్వాత కొంచెం కోలుకున్న సంగతి తెలిసిందే. కానీ అతడికి ప్రమాదం మాత్రం తప్పినట్లు కాదు. ఇప్పటికీ వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు తర్వాత చికిత్సలో ఆలస్యం జరగడం వల్ల తారకరత్న మెదడు దెబ్బ తిన్నట్లు వార్తలు వచ్చాయి. మెదడులో వాపురావడంతో దాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా ప్రస్తుతం అందుతున్న దాని కంటే ఇంకా మెరుగైన చికిత్స అవసరం పడితే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యుకలు సిద్ధపడుతున్నట్లు తాజా సమాచారం. ఈ మేరకు తారకరత్నను ఆసుపత్రిలో చూసి వచ్చిన తెలుగుదేశం నేత అంబికా లక్ష్మీనారాయణ సంకేతాలు ఇచ్చారు.
తారకరత్న హెల్త్ అప్డేట్ గురించి అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలకం కానుంది. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇవాళ రాత్రిలోపు డాక్టర్ల చేతికి నివేదిక రానుంది. మెదడులో కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై డాక్టర్లు ఫోకస్ చేశారు. తారకరత్నకు వెంటిలేటర్పైనే ఇంకా చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ చేశారు. వచ్చే నివేదికల ఆధారంగా మెదడు ఎలా పనిచేస్తుంది..? అనే విషయం తెలుస్తుంది. పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. కుటుంబ సభ్యులు అంతా చర్చించుకుని విదేశాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తారకర్నతను బాలయ్యే దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
This post was last modified on February 4, 2023 6:49 am
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…