Movie News

విదేశాల‌కు తార‌క‌ర‌త్న‌?

నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వారం కింద‌ట యువ‌గ‌ళం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా గుండెపోటుకు గురై మృత్యు అంచుల‌కు వెళ్లిన అత‌ను.. త‌ర్వాత కొంచెం కోలుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ అత‌డికి ప్ర‌మాదం మాత్రం త‌ప్పిన‌ట్లు కాదు. ఇప్ప‌టికీ వెంటిలేట‌ర్ మీదే చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు త‌ర్వాత చికిత్స‌లో ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల తార‌క‌ర‌త్న మెద‌డు దెబ్బ తిన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మెద‌డులో వాపురావ‌డంతో దాన్ని సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

కాగా ప్ర‌స్తుతం అందుతున్న దాని కంటే ఇంకా మెరుగైన చికిత్స అవ‌స‌రం ప‌డితే తార‌క‌ర‌త్న‌ను విదేశాల‌కు తీసుకెళ్ల‌డానికి కుటుంబ స‌భ్యుక‌లు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తాజా స‌మాచారం. ఈ మేర‌కు తార‌క‌ర‌త్న‌ను ఆసుప‌త్రిలో చూసి వ‌చ్చిన తెలుగుదేశం నేత అంబికా లక్ష్మీనారాయణ సంకేతాలు ఇచ్చారు.

తార‌క‌ర‌త్న హెల్త్ అప్‌డేట్ గురించి అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలకం కానుంది. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇవాళ రాత్రిలోపు డాక్టర్ల చేతికి నివేదిక రానుంది. మెదడులో కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై డాక్టర్లు ఫోకస్ చేశారు. తారకరత్నకు వెంటిలేటర్‌పైనే ఇంకా చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ చేశారు. వచ్చే నివేదికల ఆధారంగా మెదడు ఎలా పనిచేస్తుంది..? అనే విషయం తెలుస్తుంది. పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. కుటుంబ సభ్యులు అంతా చర్చించుకుని విదేశాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తారకర్నతను బాలయ్యే దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

This post was last modified on February 4, 2023 6:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

50 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago