ఒక సినిమా అనుకోకుండా చాలా పెద్ద హిట్టయితే.. భారీ వసూళ్లు సాధిస్తే.. ట్రెండ్ సెట్ చేస్తే.. ఆ తర్వాత అలాంటి సినిమాలే రావడం మామూలే. కానీ ఇలాంటి సినిమాలను అనుకరిస్తూ చేసే ప్రయత్నాలు వర్కవుట్ కావడం కష్టం. ప్రేక్షకులు అప్పటికే అలాంటి సినిమా ఒకటి చూశాక.. దాన్ని అనుకరించే సినిమాను ఎందుకు ఆదరిస్తారు? ఈ చిన్న లాజిక్ తెలియకుండా కష్టపడిపోతుంటారు ఫిలిం మేకర్స్.
‘కేజీఎఫ్’ తర్వాత దాని బాటలో వివిధ ఇండస్ట్రీల్లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆల్రెడీ కన్నడలోనే ఉపేంద్ర హీరోగా ‘కబ్జ’ అనే సినిమా తీస్తున్నారు. దాని ట్రైలర్ చూస్తే ‘కేజీఎఫ్’ను మళ్లీ దించేస్తున్నట్లు అనిపించింది. ఇంకా రిలీజ్ కాని ఈ సినిమా మీద జనాల్లో ఏమంత మంచి ఒపీనియన్ లేదు. దాని ఫలితం ఏమవుతుందో కానీ.. ఇంతలో ‘మైకేల్’ అనే సినిమా వచ్చింది.
ట్రైలర్ చూస్తే ఏమీ ‘కేజీఎఫ్’ లాగా అనిపించలేదు కానీ.. సినిమా చూసిన వాళ్లకు ముందు ‘కేజీఎఫ్’యే కళ్ల ముందు కదలాడింది. ‘కేజీఎఫ్’ లాగే ఇది కూడా మూడు దశాబ్దాల ముందు నడిచే కథ. విజువల్స్ అంతా కూడా ‘కేజీఎఫ్’నే తలపిస్తాయి. ‘కేజీఎఫ్’లో మాదిరే ఇందులోనూ హీరో ఒక అనాథ. చిన్నపుడే తల్లిని కోల్పోతాడు. ఒక లక్ష్యంతో ముంబయిలో అడుగు పెడతాడు. అక్కడ విలన్ దగ్గర చేరి.. అంచెలంచెలుగా ఎదుగుతాడు. సినిమా అంతటా కూడా హీరో గురించి ఒక పాత్ర నరేట్ చేస్తూ.. అతడికి ఎలివేషన్ ఇస్తూ సాగుతుంది. అతను మాత్రమే కాదు.. వేరే పాత్రలు కూడా హీరో కనిపిస్తే చాలు అతను వీరుడు శూరుడు అంటూ ఎలివేషన్ ఇస్తుంటాయి.
హీరో కనిపించిన ప్రతిసారీ విపరీతమైన బిల్డప్.. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ అతను ఉతికి ఆరేస్తుంటాడు. బ్యాగ్రౌండ్ స్కోర్తోనూ హీరో పాత్రకు మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. కానీ ఏం లాభం? ఈ అదనపు హంగులు, అవసరానికి మించిన ఎలివేషన్లు తప్ప కథాకథనాల్లో, సన్నివేశాల్లో విషయం కొరవడింది. ‘కేజీఎఫ్’కు ఇదొక పేల్ ఇమిటేషన్ లాగా అనిపించి ప్రేక్షకులు నిట్టూరుస్తున్నారు.
This post was last modified on February 4, 2023 6:52 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…