Dil Raju
తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో విజయే అని దిల్ రాజు నెల కిందట వ్యాఖ్యానించినపుడు పెద్ద దుమారమే రేగింది. టాక్తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు కొన్నేళ్ల నుంచి తమిళనాట రూ.60 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబడుతున్న నేపథ్యంలో విజయ్ని తాను నంబర్ వన్ హీరో అన్నట్లు దిల్ రాజు తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నా రజినీకాంత్, అజిత్ అభిమానులు ఊరుకోలేదు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు.
ఐతే ఫలానా హీరో నంబర్ వన్ అని బహిరంగంగా ప్రకటించడం కరెక్ట్ కాదు కానీ.. దిల్ రాజు మాటలు మాత్రం అబద్ధం కాదు. కొన్నేళ్ల నుంచి తమిళనాడు బాక్సాఫీస్లో విజయ్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో మరే హీరో అయినా విజయ్ తర్వాతే అని మరోసారి రుజువైంది. సంక్రాంతికి రిలీజైన అతడి లేటెస్ట్ మూవీ ‘వారిసు’కు వచ్చిన వసూళ్లే ఇందుకు ఉదాహరణ.
‘వారిసు’కు తెలుగులోనే కాదు.. తమిళంలోనే ఏమంత మంచి టాక్ రాలేదు. దీంతో పోలిస్తే అజిత్ మూవీ ‘తునివు’నే బెటర్ టాక్ తెచ్చుకుంది. ఆరంభంలో వసూళ్ల పరంగా కూడా ‘తునివు’దే ఆధిపత్యం. దీంతో విజయ్ సినిమాకు కష్టమే అన్నారంతా. దాని ఓపెనింగ్స్ చూసి రాజును ట్రోల్ చేశారు కూడా.
కానీ తర్వాత మొదలైంది అసలు కథ. ‘వారిసు’ నిలకడగా వసూళ్లు రాబడుతూ దూసుకెళ్లింది. ‘తునివు’ డౌన్ అయింది. తమిళనాడు అవతల ఎక్కడా ‘తునివు’ విజయ్ సినిమా ముందు నిలబడలేకపోయింది.
‘వారిసు’ టీం వసూళ్లను కొంచెం ఎక్కువ చేసి చూపించుకున్న మాట వాస్తవమే కానీ.. ఓవరాల్గా మాత్రం ఆ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ‘తునివు’ కంటే 30 శాతం దాకా ‘వారిసు’కు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డివైడ్ టాక్తో ఈ వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. దీంతో తమిళంలో ఇప్పుడు విజయే నంబర్ వన్ హీరో అని మరోసారి రుజువు అయింది.
This post was last modified on February 2, 2023 10:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…