ఏ సినిమాకైనా ప్రమోషన్లలో టీజర్ కట్ ఎంత ముఖ్యమో దసరా నిరూపిస్తోంది. మొన్నటి దాకా కేవలం పోస్టర్లు చూస్తూ ఇదేదో పుష్ప టైప్ రా డ్రామాని జనాలు అనుకున్నారు కానీ అంతకు మించిన వయొలెంట్ యాక్షన్ భారీగా ఉందని కేవలం నిమిషం వీడియోలోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చూపించిన శాంపిల్ కి ట్రేడ్ ఊగిపోతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఇప్పుడు పక్కాగా వచ్చేసింది. రిలీజ్ కు ఇంకో యాభై ఎనిమిది రోజులే ఉన్న నేపథ్యంలో ఏరియాల వారిగా బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి.
డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు దసరాని చదలవాడ 24 కోట్లకు మొత్తం థియేట్రికల్ హక్కులు కొనుక్కుంటే దానికి అదనంగా నాలుగు కోట్లు ఆఫర్ చేసి దిల్ రాజు ఫైనల్ గా 28 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పంపిణీదారులు రాజుగారికి ఇస్తున్న ఆఫర్లు చూస్తుంటే హీనపక్షం అయిదు నుంచి పది కోట్ల మధ్యలో లాభాలు రావడం ఖాయమంటున్నారు. అవుట్ రైట్ గా అమ్మేస్తారా లేక తనకు పట్టున్న వైజాగ్, నైజామ్ లాంటి కొన్ని ప్రాంతాలు ఉంచుకుని మిగిలినవి ఇస్తారానేది వేచి చూడాలి. కంటెంట్ కనక వర్కౌట్ అయితే ఫైనల్ రన్ కు నలభై కోట్లకు పైగానే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఇంకా ట్రైలర్ బాకీ ఉంది. కీర్తి సురేష్ ని పరిచయం చేయాల్సి ఉంది. మిగిలిన పాటలు బాలన్స్ ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇతరత్రా అవుట్ డోర్ పబ్లిసిటీ చాలా ఉంది. అసలు ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఇంకొంత టైం ఆగి ఉంటే మంచి లాభం వెనకేసుకుని ఉండేవారని ఓపెన్ గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత హైప్ తలెత్తడానికి కారణం లేకపోలేదు. పుష్ప, రంగస్థలం, కెజిఎఫ్ తరహా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ మాస్ ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుందని భారీ వసూళ్ల సాక్షిగా నిరూపితమయ్యింది. మరి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ దసరా మీద ఉండటంలో ఆశ్చర్యం ఏముంది.
This post was last modified on February 1, 2023 7:27 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…