Movie News

కొత్త సంక్రాంతికి దిల్ రాజు స్కెచ్ ?

ఈ ఏడాది ఆరంభంలో ఎన్నాడో లేని విధంగా దిల్ రాజు పై ట్రోలింగ్ జరిగింది. ఇదంతా సంక్రాంతి బరిలో నిలిచిన వారసుడు వల్లే. గతంలో సంక్రాంతికి తెలుగు సినిమాలు రిలీజ్ ఉండగా డబ్బింగ్ సినిమాకి కావాల్సినన్నీ థియేటర్స్ ఎలా ఇస్తామంటూ చెప్పిన దిల్ రాజు ఈసారి తమిళ్ సినిమాను తెలుగులో ఎలా రిలీజ్ చేస్తారని అందరూ ప్రశ్నించారు. తను తెలుగు నిర్మాత అని డైరెక్టర్ కూడా తెలుగు వాడని దిల్ రాజు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఓ సందర్భంలో వెనక్కి తగ్గి వారసుడు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.

ఇదంతా ఆలోచించి నెక్స్ట్ సంక్రాంతికి భారీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట దిల్ రాజు. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ -శంకర్ కాంబో మూవీ rc15 ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అందరి కంటే ముందే సంక్రాంతి 2024 స్లాట్ పై కన్నేసి తన పాన్ ఇండియా సినిమాతో సందడి చేయాలని భావిస్తున్నాడట.

రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న rc15 షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అనుకున్న టైమ్ కి షూటింగ్ జరిగితే సినిమా ఈ ఏడాదే థియేటర్స్ లోకి రావాలి. కానీ శంకర్ భారీ మేకింగ్ , అవుట్ డోర్ ఘాట్ కారణం చేత బ్రేకులు పడుతూ తెరకెక్కుతుంది. సినిమాను శంకర్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిస్తున్నాడని టాక్. వచ్చే ఏడాది ఎలెక్షన్స్ కూడా ఉన్నాయి కనుక సంక్రాంతి కి ఈ సినిమాపై భారీ హైప్ ఉండనే ఉంటుంది. అందుకే అన్నీ ఆలోచించి దిల్ రాజు కొత్త సంక్రాంతి స్కెచ్ వేసి త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇకపై దిల్ రాజు బేనర్ నుండి ప్రతీ సంక్రాంతికి ఓ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

This post was last modified on February 1, 2023 6:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

56 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago