ఎప్పుడో గత ఏడాది ఆగస్టు 12నే రావాల్సిన సినిమా ‘ఏజెంట్’. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా తప్పలేదు. తర్వాత క్రిస్మస్ రిలీజ్ అన్నారు. ఆపై సంక్రాంతి విడుదల గురించి కూడా మాట్లాడుకున్నారు. కానీ అన్ని సీజన్లూ అయిపోయాయి. ‘ఏజెంట్’ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఐతే చివరగా ఒక డేట్ అనుకుని ఆ తేదీకే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
వేసవి రిలీజ్కు ‘ఏజెంట్’ను రెడీ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమా రావాల్సిన ఏప్రిల్ 14వ తేదీకి ‘ఏజెంట్’ను ఫిక్స్ చేశారట. ‘భోళా శంకర్’ వాయిదా పడి ఈ ఏడాది ద్వితీయార్ధానికి వెళ్లిపోవడంతో ‘ఏజెంట్’ కోసం ఆ డేట్ను తీసుకుంటున్నారట. అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’ రాబోతోంది. కాబట్టి ‘అఖిల్’కు గట్టి పోటీ తప్పదన్నమాట.
హీరోగా తొలి మూడు చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న అఖిల్.. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కొంచెం ఉపశమనం పొందాడు. అది పెద్ద హిట్ కాదు కానీ.. అఖిల్కు తొలి సక్సెస్ అందించింది. కానీ ఆ సినిమా వల్ల అఖిల్ ఇమేజ్ ఏమీ పెరగలేదు. ఐతే ‘ఏజెంట్’ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కావడం, హీరోయిజం ఒక రేంజిలో ఉండడంతో అఖిల్ అసలు సత్తాను బయటికి తెస్తుందని అంచనా వేస్తున్నారు.
సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం కూడా అంచనాలను పెంచేదే. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నాడు. గత ఏడాది రిలీజైన టీజర్ సినిమాపై హైప్ పెంచింది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ సాక్షి వైద్య అఖిల్కు జోడీగా నటిస్తోంది. అఖిల్ ఇందులో ఏజెంట్ పాత్రలో చాలా వైల్డ్గా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం అఖిల్ అసాధారణ స్థాయిలో బాడీ పెంచాడు.
This post was last modified on January 31, 2023 4:51 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…