దర్శక దిగ్గజం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్సి 15 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలైనప్పటి నుంచి ఒక ఆరేడు నెలలు షూటింగ్ సవ్యంగానే నడిచింది కానీ ఎప్పుడైతే ఇండియన్ 2ని పూర్తి చేసే బాధ్యతను ఒకే సమయంలో శంకర్ నెత్తినవేసుకున్నారో అప్పటి నుంచి రెట్టింపు ఒత్తిడితో సతమతమవుతున్నారు. క్రమంగా ఇది ఉచ్చులా మారిపోతోంది. చరణ్ ప్రాజెక్టుకు సంబంధించి జాప్యం ఎక్కువైపోవడంతో నిర్మాత దిల్ రాజుకి ఆర్థికంగా భారం పెరుగుతోంది. 2024 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలన్నది ఆయన టార్గెట్.
మరోవైపు ఇండియన్ 2ని ప్రస్తుతం కడప జిల్లా గండికోటలో చేస్తున్న శంకర్ ఆ షెడ్యూల్ పూర్తి చేశాక తిరిగి చరణ్ తో జాయిన్ అవ్వాలి. ఎంత గొప్ప డైరెక్టరైనా ఒకేసారి రెండు ప్యాన్ ఇండియాలు హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి వరల్డ్ క్లాస్ మాస్టర్సే ఒక టైంలో ఒక సినిమానే చేస్తారు. అలాంటిది శంకర్ డ్యూయల్ సింని బ్యాలన్స్ చేయడం కత్తి కొనమీద నడవటం లాంటిది. పైగా ఒకపక్క కమల్ హాసన్ లాంటి లెజెండ్ మరో పక్క చరణ్ లాంటి యంగ్ జెనరేషన్ స్టార్ హీరో. ఇదంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ ప్రెజర్ సైతం ఆయన మీద పడుతున్నట్టు టాక్.
ఇండియన్ 2ని అయితే దీపావళి లేదా సంక్రాంతికి తేవాలని నిర్మాణ సంస్థ లైకా ప్లాన్ లో ఉంది. మొదటి ఆప్షన్ తో ఇబ్బంది లేదు. రెండోది అయితే తన సినిమాతో తనే పండక్కు పోటీ పడాల్సి వస్తుంది. అది తమిళనాడులో దిల్ రాజుకి ఇబ్బందికర పరిణామంగా నిలుస్తుంది. థియేటర్ల విషయంలో మళ్ళీ సమస్యలు తలెత్తుతాయి. శంకర్ మూవీ అనే ట్యాగ్ పని చేయదు. ఎందుకంటే అటుపక్క ఉన్నది కూడా శంకరే కాబట్టి. సో ఎలా చూసుకున్న కమల్ ముందు వచ్చేయడమే అందరికీ క్షేమకరంగా తోస్తోంది. మరి శంకర్ ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేసి గట్టెక్కుతారో వేచి చూడాలి.
This post was last modified on January 31, 2023 11:49 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…