తమిళంలో ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే నంబర్ వన్ హీరో విజయ్ కాగా.. నంబర్ వన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజే. టాక్తో సంబంధం లేకుండా తన సినిమాలతో భారీ వసూళ్లు రాబడుతూ మిగతా హీరోల కంటే ఎత్తులో నిలుస్తున్నాడు విజయ్. ఇక ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ కనకరాజ్ ఎంత పెద్ద విజయాలందుకున్నాడో తెలిసిందే.
విజయ్, లోకేష్ కలయికలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చింది. తమిళంలో అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా చాన్నాళ్ల ముందే ఖరారైంది. లోకేష్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. విక్రమ్ తర్వాత తన సినిమా విజయ్తోనే అన్నాడు. ఐతే ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాజెక్టును ప్రకటించారు. విజయ్ 67వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.
7 స్క్రీన్స్ స్టూడియో బేనర్ మీద లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. మాస్టర్, విక్రమ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. ఇంకా పేరున్న టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమాకు పని చేయనున్నారు. లోకేష్ తొలి సినిమా మానగరంతో మొదలుపెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రానికి ఒక కనెక్షన్ కనిపిస్తుంది.
విక్రమ్లో అతను తీసిన అన్ని సినిమాలకు ఉన్న కనెక్షన్ చూపించి లోకేష్ మల్టీవర్స్ అనే కొత్త మాటను ట్రెండ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయ్తో చేయబోయే సినిమాకు కూడా మిగతా చిత్రాలతో కనెక్షన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి ఈసారి అతను ఎలాంటి కథను నరేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. ఈ సంక్రాంతికి విడుదలైన విజయ్ కొత్త సినిమా వారిసు డివైడ్ టాక్తోనే భారీ వసూళ్లు రాబట్టింది. లోకేష్తో అతను చేయబోయే సినిమాకు హైప్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 30, 2023 10:29 pm
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…