తమిళంలో ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే నంబర్ వన్ హీరో విజయ్ కాగా.. నంబర్ వన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజే. టాక్తో సంబంధం లేకుండా తన సినిమాలతో భారీ వసూళ్లు రాబడుతూ మిగతా హీరోల కంటే ఎత్తులో నిలుస్తున్నాడు విజయ్. ఇక ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ కనకరాజ్ ఎంత పెద్ద విజయాలందుకున్నాడో తెలిసిందే.
విజయ్, లోకేష్ కలయికలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చింది. తమిళంలో అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా చాన్నాళ్ల ముందే ఖరారైంది. లోకేష్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. విక్రమ్ తర్వాత తన సినిమా విజయ్తోనే అన్నాడు. ఐతే ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాజెక్టును ప్రకటించారు. విజయ్ 67వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.
7 స్క్రీన్స్ స్టూడియో బేనర్ మీద లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. మాస్టర్, విక్రమ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. ఇంకా పేరున్న టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమాకు పని చేయనున్నారు. లోకేష్ తొలి సినిమా మానగరంతో మొదలుపెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రానికి ఒక కనెక్షన్ కనిపిస్తుంది.
విక్రమ్లో అతను తీసిన అన్ని సినిమాలకు ఉన్న కనెక్షన్ చూపించి లోకేష్ మల్టీవర్స్ అనే కొత్త మాటను ట్రెండ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయ్తో చేయబోయే సినిమాకు కూడా మిగతా చిత్రాలతో కనెక్షన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి ఈసారి అతను ఎలాంటి కథను నరేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. ఈ సంక్రాంతికి విడుదలైన విజయ్ కొత్త సినిమా వారిసు డివైడ్ టాక్తోనే భారీ వసూళ్లు రాబట్టింది. లోకేష్తో అతను చేయబోయే సినిమాకు హైప్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 30, 2023 10:29 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…