తమిళంలో ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే నంబర్ వన్ హీరో విజయ్ కాగా.. నంబర్ వన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజే. టాక్తో సంబంధం లేకుండా తన సినిమాలతో భారీ వసూళ్లు రాబడుతూ మిగతా హీరోల కంటే ఎత్తులో నిలుస్తున్నాడు విజయ్. ఇక ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ కనకరాజ్ ఎంత పెద్ద విజయాలందుకున్నాడో తెలిసిందే.
విజయ్, లోకేష్ కలయికలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చింది. తమిళంలో అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా చాన్నాళ్ల ముందే ఖరారైంది. లోకేష్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. విక్రమ్ తర్వాత తన సినిమా విజయ్తోనే అన్నాడు. ఐతే ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాజెక్టును ప్రకటించారు. విజయ్ 67వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.
7 స్క్రీన్స్ స్టూడియో బేనర్ మీద లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. మాస్టర్, విక్రమ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. ఇంకా పేరున్న టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమాకు పని చేయనున్నారు. లోకేష్ తొలి సినిమా మానగరంతో మొదలుపెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రానికి ఒక కనెక్షన్ కనిపిస్తుంది.
విక్రమ్లో అతను తీసిన అన్ని సినిమాలకు ఉన్న కనెక్షన్ చూపించి లోకేష్ మల్టీవర్స్ అనే కొత్త మాటను ట్రెండ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయ్తో చేయబోయే సినిమాకు కూడా మిగతా చిత్రాలతో కనెక్షన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి ఈసారి అతను ఎలాంటి కథను నరేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. ఈ సంక్రాంతికి విడుదలైన విజయ్ కొత్త సినిమా వారిసు డివైడ్ టాక్తోనే భారీ వసూళ్లు రాబట్టింది. లోకేష్తో అతను చేయబోయే సినిమాకు హైప్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 30, 2023 10:29 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…