బాలయ్య ఆహా వీడియో కోసం హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయింది. పవన్ కళ్యాణ్ తో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చేసి సీజన్ 2 ఎండ్ కార్డ్ వేసేశాడు బాలయ్య. ప్రభాస్ ఎపిసోడ్స్ లానే పవన్ ఎపిసోడ్స్ ను కూడా రెండు భాగాలుగా వదలబోతున్నారు. ఫిబ్రవరి ౩న రాబోతున్న పార్ట్ 1 ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో పవన్ ను బాలయ్య “ఈశ్వరా… పవనేశ్వర” అంటూ వెల్కం చెప్పడం , అలాగే “నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు” అంటూ బాలయ్య షో ఆరంభంలో చెప్పే డైలాగ్ ను పవన్ చెప్పడం ప్రోమోలో హైలైట్ గా కనిపిస్తుంది.
మొదటి ఎపిసోడ్ లో బాలయ్య పవన్ లైఫ్ స్టైల్ గురించి తన మెంటాలిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఇక సాయి ధరం తేజ్ ఎంట్రీ, ఇద్దరితో సరదాగా మాట్లాడటం బాలయ్య తొడ కొట్టే ప్రయత్నం చేయడం హాస్యం తెప్పించింది. పవన్ ను బాలయ్య మనం మొదటి సారి ఎక్కడ కలిశామో గుర్తుందా ? అంటూ పవన్ ను అడుగుతూ సుస్వాగతం ఓపెనింగ్ స్టిల్ చూపించడం , రామ్ చరణ్ కాల్ చేసినప్పుడు “ఏమయ్యా ఫిట్టింగ్ మాస్టర్” అని బాలయ్య అనడం. ఇవన్నీ పార్ట్ 1 పై ఆసక్తి పెంచుతున్నాయి. అలాగే బాలయ్య పవన్ పెళ్ళిళ్ళ గురించి అడిగే విషయం కూడా ప్రోమోలో హైలైట్ చేశారు.
అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్ కి కూడా ఇంతకంటే ఎక్కువే ఆహా టీం ప్రమోట్ చేసి ప్రోమోలతో హంగామా చేసింది. కంటెంట్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. కానీ ఒక ఎపిసోడ్ ను లాగి లాగి రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయడం కాస్త తేడా కొట్టింది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. మరి ఇప్పుడు పవన్ ఎపిసోడ్ కి ఆహా టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూడాలి.
This post was last modified on January 28, 2023 11:13 am
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…