నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారానికి దారి తీశాయో తెలిసిందే. అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు ఈ రంగారావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దిగ్గజ నటుల అభిమానులను బాధించాయి. ఏఎన్నార్ మనవళ్లయిన నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా.. అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు.
మరోవైపు ఎస్వీఆర్ను అవమానించిన బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు పేరుతో కొందరు ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. కాగా ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాలయ్య వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏమీ లేదని తేల్చేశారు. ఎస్వీఆర్ మనవళ్లు చిన్న ఎస్వీఆర్, ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) ఈ మేరకు వీడియో ప్రకటన విడుదల చేశారు.
”నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం” అని చిన్న ఎస్వీఆర్, బాబాజీ పేర్కొన్నారు.
This post was last modified on January 26, 2023 6:12 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…