నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారానికి దారి తీశాయో తెలిసిందే. అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు ఈ రంగారావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దిగ్గజ నటుల అభిమానులను బాధించాయి. ఏఎన్నార్ మనవళ్లయిన నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా.. అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు.
మరోవైపు ఎస్వీఆర్ను అవమానించిన బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు పేరుతో కొందరు ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. కాగా ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాలయ్య వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏమీ లేదని తేల్చేశారు. ఎస్వీఆర్ మనవళ్లు చిన్న ఎస్వీఆర్, ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) ఈ మేరకు వీడియో ప్రకటన విడుదల చేశారు.
”నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం” అని చిన్న ఎస్వీఆర్, బాబాజీ పేర్కొన్నారు.
This post was last modified on January 26, 2023 6:12 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…