కొన్ని వారాల ముందు వరకు ‘పఠాన్’ టీం బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఈ సినిమాను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేస్తూ ప్రమోషన్లకు కూడా ఇబ్బంది కలిగించడం, సోషల్ మీడియాలో అదే పనిగా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సినిమాను బాయ్కాట్ చేయాలని పిలుపునివ్వడం చూసి రిలీజ్ టైంలో ఏం జరుగుతుందో ఏమో అనుకున్నారు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జనాలు ఈ బాయ్కాట్ పిలుపులనేమీ పట్టించుకోలేదు. ఈ సినిమా మీద ఆ వర్గం చూపించిన ద్వేషం కాస్తా.. జనాల్లో సానుభూతికి కారణమైంది. సినిమా ప్రోమోలు కూడా బాగుండడంతో మంచి హైప్ వచ్చింది. ఇంకేముంది.. బాక్సాఫీస్ దగ్గర సునామీకి రంగం సిద్ధమైంది. ఓవైపు ఏడాదిగా పెద్ద పెద్ద హిందీ సినిమాలు కనీసం పది కోట్ల డే-1 వసూళ్లకు కూడా నోచుకోకపోతుంటే.. ‘పఠాన్’ ఏకంగా రూ.50 కోట్ల వసూళ్ల మార్కుపై కన్నేసింది.
‘పఠాన్’కు జరిగిన ప్రి సేల్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ పండిట్లే నోరెళ్లబెట్టేశారు. బుకింగ్స్ ఓపెన్ అయిన రెండు రోజుల్లోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడు కాగా.. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగింది. విడుదలకు ముందు రోజు ఇండియాలో ప్రి సేల్స్ ఏకంగా 5 లక్షల మార్కును దాటేశాయి.
ఇండియన్ ఫిలిం హిస్టరీలో విడుదలకు ముందు అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘బాహుబలి-2’ పేరిట రికార్డు ఉంది. ఆ సినిమా టికెట్లు ముందే 6.5 లక్షల దాకా అమ్ముడయ్యాయి. గత ఏడాది ‘కేజీఎఫ్-2’ 5.15 లక్షల టికెట్లతో రెండో స్థానంలో నిలిచింది. ‘పఠాన్’ మంగళవారం మధ్యాహ్నానికే 5.25 లక్షల టికెట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరుకుంది. ప్రి సేల్స్ చివరికి 5.5 లక్షల మార్కును కూడా దాటేసి ఉండొచ్చు. ఈ సినిమాకు రిలీజ్ వీక్లో ప్రమోషన్లన్నవే లేకపోయాయి. సినిమాను అగ్రెసివ్గా ప్రమోట్ చేసి ఉంటే ఇంకా హైప్ పెరిగి ‘బాహుబలి-2’ రికార్డుకు కూడా చేరువయ్యేదేమో.
This post was last modified on January 25, 2023 9:48 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…