తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు యావత్ భారతదేశపు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ఉద్విగ్న ఘట్టంలో మొదటి అంకం విజయవంతంగా పూర్తయ్యింది. ఇందాక ప్రకటించిన ఆస్కార్ 95 నామినేషన్లలో ఒరిజినల్ సాంగ్ విభాగం కింద ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటుకి చోటు దక్కింది. తుది పోరు కోసం నలుగురితో ఎంఎం కీరవాణి పోటీ పడబోతున్నారు. టెల్ లైక్ ఏ విమెన్ నుంచి అప్లాజ్ కు గాను డియన్ వారెన్, టాప్ గన్ మావరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాటకు లేడీ గాగా అండ్ బ్లడ్ పాప్, బ్లాక్ పాంథర్ వాకండ ఫరెవర్ నుంచి లిఫ్ట్ మీ అప్ కు టెమ్స్ – రిహన్న – రియాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరన్ సన్ లిస్టులో ఉన్నారు. ఎవరీ థింగ్ ఎవరి వేర్ ఆల్ అట్ వన్స్ నుంచి థిస్ ఈజ్ ఏ లైఫ్ గాను రియాన్ – డేవిడ్ – మిట్స్ కిలకు చోటు దక్కింది.
ఈ అయిదు పాటలకు గాను ప్రతి నామినేషన్ కింద గీత రచయిత పేరు కూడా ఇచ్చారు. చంద్రబోస్ ఆ అరుదైన ఘనతను అందుకున్నారు. మిగిలిన విభాగాల్లో ఒక్కొకటిగా పేర్లు ప్రకటిస్తున్నారు కానీ ఇంకా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి నిరాశే కలుగుతోంది. పెర్ఫార్మన్స్ కు గాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందన్న అంచనా నెరవేరేలా లేదు. ఎప్పుడూ లేనిది భారీ సంఖ్యలో టాలీవుడ్ ఆడియన్స్ యూట్యూబ్ లో ఈవెంట్ ని లైవ్ చూసేందుకు ఉత్సాహపడటం గమనార్హం. నాటు నాటు ప్రకటన రాగానే కలిగిన ఆనందం మాములుగా లేదు.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ సాధించిన నాటు నాటు కనక నిజంగా ఆస్కార్ పురస్కారం అందుకుంటే స్టేజి మీద ప్రపంచం మొత్తం చూస్తుండగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లైవ్ డాన్స్ చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఒక ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి హామీ కూడా ఇచ్చారు. కానీ పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి అంత సులభంగా ఆశలు పెట్టుకోలేం కానీ అలా అని అసాధ్యమని కూడా చెప్పలేం. తెలుగు వాడి విజయపతాకం ఆస్కార్ వీధుల్లో ఎగురుతుందో లేదో ఇంకో రెండు నెలల్లో తేలనుంది. అప్పటిదాకా కీరవాణితో పాటు ఆయన బృందం మొత్తం హై టెన్షన్ ని చవిచూడాల్సిందే.
This post was last modified on January 24, 2023 7:56 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…