Movie News

వరంగల్ గడ్డపై వీరయ్య బాస్ పార్టీ

సంక్రాంతి సినిమాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య నిన్నటితో 200 కోట్ల గ్రాస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నా మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించడంతో డౌట్లు తీరిపోయాయి. వీరసింహారెడ్డి విజయోత్సవం జరిగాక తమ సక్సెస్ మీట్ ఎప్పుడని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరుస్తూ ఈ 28న వరంగల్ లో గ్రాండ్ బాస్ పార్టీని నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారట. రేపో ఎల్లుండో ప్రకటన వచ్చేస్తుంది.

ఇక్కడ దాకా ప్రయాణం మహా జోరుగా సాగింది కానీ నిన్నటి నుంచి వాల్తేరు వీరయ్య కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా సీడెడ్ వైపు ఇది తీవ్రంగా ఉంది. ఉత్తరాంధ్రలో కలెక్షన్లు స్టడీగా ఉండగా నైజామ్ లో పదకొండో రోజు నుంచి ఆశించిన స్పీడ్ లేదు. పైగా అందరి దృష్టి పఠాన్ రిలీజ్ వైపు వెళ్లిపోవడంతో సహజంగానే దాని ప్రభావం నెంబర్ల మీద పడుతోంది. టికెట్ రేట్ల పెంపుని ఏపీలో నిన్నటి నుంచి మినహాయించుకోవడంతో సాధారణ ధరలే అందుబాటులోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో ఇంకా 295 రూపాయలే ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోని దెబ్బ కొడుతోంది.

మరోవైపు యుఎస్ లో 2.2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాక మెగా మూవీ వేగం తగ్గిపోయింది. మహా అయితే 2.5ని టచ్ చేయడం మినహా 3 మిలియన్ అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు రాబోయే వీకెండ్ ఏమైనా అనూహ్యంగా పికప్ అయితే చెప్పలేం కానీ లేదంటే కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. వరంగల్ లో చేయబోయే ఈవెంట్ ఈ మూవీకి ఆఖరుది కానుంది. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజులు అన్నీ అయిపోయాయి. ఇదొక్కటి చేస్తే మైత్రికి పండగ టెన్షన్ ముగింపుకొస్తుంది. ఆపై ఫిబ్రవరి 10న విడుదల కానున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తాలూకు వ్యవహారాల్లో బిజీ అయిపోతారు.

Satya

Recent Posts

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

29 minutes ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

2 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

3 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

4 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

4 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

5 hours ago