టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఇక్కడి స్టార్ డైరెక్టర్లలో ఒకడైన వంశీ పైడిపల్లి.. తమిళ టాప్ స్టార్ విజయ్తో రూపొందించిన సినిమా ‘వారిసు’. ఈ కాంబినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. రకరకాల కారణాల వల్ల విడుదల ముంగిట ఈ సినిమా మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. రిలీజ్ తర్వాత కూడా వ్యవహారం మారలేదు.
సినిమా మరీ రొటీన్గా ఉండడం.. చాలా సినిమాలను కలిపి కిచిడీలా వడ్డించడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి బాగా ట్రోలింగ్కు గురయ్యాడు. తనను, తన సినిమాను ట్రోల్ చేసిన వారి మీద వంశీ కౌంటర్లు వేస్తే.. మళ్లీ అతడి వ్యాఖ్యల్ని పట్టుకుని ఇంకో రౌండ్ ట్రోల్ చేశారు నెటిజన్లు. ఆ ఇంటర్వ్యూలో వంశీ అన్న ‘నాట్ ఎ జోక్ బ్రదర్’ అనే మాట కూడా మీమ్ పేజీల్లో ఒక కల్ట్ డైలాగ్ అయిపోయింది.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ‘వారిసు’ కలెక్షన్ల మీద జరుగుతున్న కామెడీ మరో ఎత్తు. ఈ సినిమా రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా తాజాగా పోస్టర్ దించారు. కానీ ట్రేడ్ పండిట్ల అంచనాలకు, నిర్మాణ సంస్థ ప్రకటిస్తున్న వసూళ్లకు అసలు పొంతన లేదన్నది కోలీవుడ్ వర్గాల మాట. తొలి రోజు నుంచి వాస్తవ కలెక్షన్లను అదనంగా కలిపి పోస్టర్లు దించుుతున్నారు.. రోజుకు ఇంత అని ఫేక్ యాడ్ చేస్తున్నారని.. ఆ లెక్కల ప్రకారమే 11 రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా కొత్త పోస్టర్ వదిలారని అంటున్నారు.
ఓవైపు ‘తునివు’ బలమైన పోటీ ఇస్తుండగా.. డివైడ్ టాక్తో మొదలైన సినిమా 11 రోజుల్లో 250 కోట్లు వసూలు చేయడం ఏంటని.. ఈ నంబర్ ఎంతమాత్రం నమ్మశక్యంగా లేదని.. హీరోను మెప్పించడానికి, తమ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అని చెప్పడానికి.. ఇలా పోస్టర్లు దించుతున్నారని.. దీని వల్ల కలెక్షన్ల వ్యవహారం కామెడీగా మారిపోయిందని నెటిజన్లు ‘వారిసు’ టీం మీద పంచులు వేస్తున్నారు.
This post was last modified on January 24, 2023 4:39 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…