టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఇక్కడి స్టార్ డైరెక్టర్లలో ఒకడైన వంశీ పైడిపల్లి.. తమిళ టాప్ స్టార్ విజయ్తో రూపొందించిన సినిమా ‘వారిసు’. ఈ కాంబినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. రకరకాల కారణాల వల్ల విడుదల ముంగిట ఈ సినిమా మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. రిలీజ్ తర్వాత కూడా వ్యవహారం మారలేదు.
సినిమా మరీ రొటీన్గా ఉండడం.. చాలా సినిమాలను కలిపి కిచిడీలా వడ్డించడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి బాగా ట్రోలింగ్కు గురయ్యాడు. తనను, తన సినిమాను ట్రోల్ చేసిన వారి మీద వంశీ కౌంటర్లు వేస్తే.. మళ్లీ అతడి వ్యాఖ్యల్ని పట్టుకుని ఇంకో రౌండ్ ట్రోల్ చేశారు నెటిజన్లు. ఆ ఇంటర్వ్యూలో వంశీ అన్న ‘నాట్ ఎ జోక్ బ్రదర్’ అనే మాట కూడా మీమ్ పేజీల్లో ఒక కల్ట్ డైలాగ్ అయిపోయింది.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ‘వారిసు’ కలెక్షన్ల మీద జరుగుతున్న కామెడీ మరో ఎత్తు. ఈ సినిమా రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా తాజాగా పోస్టర్ దించారు. కానీ ట్రేడ్ పండిట్ల అంచనాలకు, నిర్మాణ సంస్థ ప్రకటిస్తున్న వసూళ్లకు అసలు పొంతన లేదన్నది కోలీవుడ్ వర్గాల మాట. తొలి రోజు నుంచి వాస్తవ కలెక్షన్లను అదనంగా కలిపి పోస్టర్లు దించుుతున్నారు.. రోజుకు ఇంత అని ఫేక్ యాడ్ చేస్తున్నారని.. ఆ లెక్కల ప్రకారమే 11 రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా కొత్త పోస్టర్ వదిలారని అంటున్నారు.
ఓవైపు ‘తునివు’ బలమైన పోటీ ఇస్తుండగా.. డివైడ్ టాక్తో మొదలైన సినిమా 11 రోజుల్లో 250 కోట్లు వసూలు చేయడం ఏంటని.. ఈ నంబర్ ఎంతమాత్రం నమ్మశక్యంగా లేదని.. హీరోను మెప్పించడానికి, తమ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అని చెప్పడానికి.. ఇలా పోస్టర్లు దించుతున్నారని.. దీని వల్ల కలెక్షన్ల వ్యవహారం కామెడీగా మారిపోయిందని నెటిజన్లు ‘వారిసు’ టీం మీద పంచులు వేస్తున్నారు.
This post was last modified on January 24, 2023 4:39 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…