వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వీరంగం పది రోజులుగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఇవాళ సోమవారం నుంచి గణనీయమైన డ్రాప్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆధిపత్యం మాత్రం చిరంజీవిదేన్న క్లారిటీ వసూళ్లలో బయట పడుతోంది. ఈ సందర్భంగా యుఎస్ మెగాభిమానులు నిన్న ఒకేసారి పాతిక లొకేషన్లలో స్పెషల్ గా ఫ్యాన్స్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేసుకున్నారు. మొదటి రోజు అన్నంత రేంజ్ లో హడావిడి చేస్తూ పూల చొక్కాలు లుంగీలతో మాస్ ఎంటర్ టైనర్ ని ఎంజాయ్ చేశారు. ఇక్కడో స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే చిరంజీవి నేరుగా వీడియో కాల్ ద్వారా లైవ్ లోకి రావడం.
స్క్రీనింగ్ మధ్యలో జూమ్ తరహా కాల్ ద్వారా ఒకేసారి అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. ముందు సూట్ లో వచ్చి పలకరించి ఆ తర్వాత కొన్ని నిముషాలు గ్యాప్ తీసుకుని వాల్తేరు వీరయ్య గెటప్ లో గాగుల్స్ పెట్టుకుని రావడంతో షోకు వచ్చిన వాళ్ళ ఆనందం మాములుగా లేదు. ఈ సందర్భంగా ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటూ సరదాగా ఒక విషయం చెప్పాలని రేటింగ్స్ ప్రస్తావన తెచ్చారు. చాలామంది తన సినిమాకు రెండు నుంచి రెండుంపావు రేటింగ్ ఇచ్చారని అయితే అప్పుడు ఏదో అనుకున్నామని తీరా చూస్తే ఇప్పుడదే నెంబర్ తో అంతే మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చిందని సరదా సెటైర్ వేశారు.
దీనికి ఫ్యాన్స్ స్పందన ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఏ ఉద్దేశంతో అన్నా నిజంగానే వాల్తేరు వీరయ్య ఏ క్రిటిక్ ఊహకు అందనంత అతీతంగా బ్లాక్ బస్టర్ అయిన మాట వాస్తవం. వంద కోట్ల షేర్ దాటేసి ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందో అంతు చిక్కడం లేదు. ఈ సక్సెస్ తాలూకు ఆనందం చిరు మోహంలో మాములుగా లేదు. మీకేం కావాలో అర్థమయ్యిందని ఇకపై సైరా గాడ్ ఫాదర్ లాంటి ప్రయోగాలు ఉండవని, కేవలం మాస్ మెప్పించే ఘరానా కంటెంట్ తోనే వస్తానని హామీ ఇచ్చేశారు. అయినా మాస్ పల్స్ పట్టేసుకోవడం కష్టంగా మారుతున్న ట్రెండ్ లో మరీ ఎక్కువ మూసకు కట్టుబడినా ఇబ్బందే.
This post was last modified on January 23, 2023 11:22 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…