సెలబ్రెటీలు, ధనవంతులైన మహిళలు సరోగసీ మార్గంలో బిడ్డల్ని కనడం మీద ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. గర్భం దాల్చి బిడ్డను కంటే తమ అందం దెబ్బ తింటుందని, డెలివరీ సమయంలో బాధను భరించలేమనే ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్తున్నారనే ఆరోపణలు సెలబ్రెటీల మీద బలంగా వినిపిస్తున్నాయి.
నిక్ జోనాస్ను పెళ్లాడిన బాలీవుడ్ భామక ప్రియాంక చోప్రా సైతం ఈ ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్లిందనే సందేహాలు ఆ మధ్య వ్యక్తమయ్యాయి. ఐతే ఈ కామెంట్లు తనను ఎంతగానో బాధించినట్లు ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాము సరోగసీకి వెళ్లడానికి కారణాలు వేరని ఆమె స్పష్టం చేసింది.
” నా అందం దెబ్బ తింటుందనే సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు చూసి చాలా బాధ పడ్డా. కానీ వాస్తవం వేరు. మేమేమీ కావాలని సరోగసీకి వెళ్లలేదు. నాకు వైద్యపరమైన సమస్యలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీని ఎంచుకోవాల్సి వచ్చింది. మా బిడ్డను గర్భంలో మోయడానికి అంగీకరించిన మహిళ ఎంతో దయగలిగింది. కొన్ని నెలల పాటు వెతికాక మాకు ఆమె దొరికింది. దాదాపుగా ఆరు నెలల పాటు మా బిడ్డను ఆమె జాగ్రత్తగా కాపాడింది.
మా పాప నిర్ణీత వ్యవధి కంటే మూడు నెలల ముందే జన్మించింది. ఆమె పుట్టినపుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆ సమయంలో పాప బరువు చాలా తక్కువ. నా చేతి కంటే చిన్నగా ఉండేది. ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. మాకు బిడ్డను కని ఇచ్చిన మహిళ పేరు కలిసొచ్చేలా పాపకు మాల్దీ అని పేరు పెట్టుకున్నాం. నా చిన్నారికి సంబంధించి ఎటువంటి గాసిప్స్ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీడియాకు దూరంగా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. ” అని ప్రియాంక తెలిపింది.
This post was last modified on January 23, 2023 6:10 am
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…