సెలబ్రెటీలు, ధనవంతులైన మహిళలు సరోగసీ మార్గంలో బిడ్డల్ని కనడం మీద ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. గర్భం దాల్చి బిడ్డను కంటే తమ అందం దెబ్బ తింటుందని, డెలివరీ సమయంలో బాధను భరించలేమనే ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్తున్నారనే ఆరోపణలు సెలబ్రెటీల మీద బలంగా వినిపిస్తున్నాయి.
నిక్ జోనాస్ను పెళ్లాడిన బాలీవుడ్ భామక ప్రియాంక చోప్రా సైతం ఈ ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్లిందనే సందేహాలు ఆ మధ్య వ్యక్తమయ్యాయి. ఐతే ఈ కామెంట్లు తనను ఎంతగానో బాధించినట్లు ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాము సరోగసీకి వెళ్లడానికి కారణాలు వేరని ఆమె స్పష్టం చేసింది.
” నా అందం దెబ్బ తింటుందనే సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు చూసి చాలా బాధ పడ్డా. కానీ వాస్తవం వేరు. మేమేమీ కావాలని సరోగసీకి వెళ్లలేదు. నాకు వైద్యపరమైన సమస్యలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీని ఎంచుకోవాల్సి వచ్చింది. మా బిడ్డను గర్భంలో మోయడానికి అంగీకరించిన మహిళ ఎంతో దయగలిగింది. కొన్ని నెలల పాటు వెతికాక మాకు ఆమె దొరికింది. దాదాపుగా ఆరు నెలల పాటు మా బిడ్డను ఆమె జాగ్రత్తగా కాపాడింది.
మా పాప నిర్ణీత వ్యవధి కంటే మూడు నెలల ముందే జన్మించింది. ఆమె పుట్టినపుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆ సమయంలో పాప బరువు చాలా తక్కువ. నా చేతి కంటే చిన్నగా ఉండేది. ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. మాకు బిడ్డను కని ఇచ్చిన మహిళ పేరు కలిసొచ్చేలా పాపకు మాల్దీ అని పేరు పెట్టుకున్నాం. నా చిన్నారికి సంబంధించి ఎటువంటి గాసిప్స్ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీడియాకు దూరంగా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. ” అని ప్రియాంక తెలిపింది.
This post was last modified on January 23, 2023 6:10 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…