జీవిత సారాన్ని తూటాల్లాంటి మాటలతో.. సూటిగా సుత్తి లేకుండా చెప్పగల నైపుణ్యం ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ తరం యువతకు ఏ స్టయిల్లో చెబితే విషయం ఎక్కుతుందో ఆయనకు చాలా బాగా తెలుసు. నేనింతే, బిజినెస్మేన్ లాంటి సినిమాల్లో పూరి బోధించిన జీవిత పాఠాలు చాలామంది మనసుల్లోకి దూసుకెళ్లిపోయాయి.
ఆ మాటలు ప్రీచింగ్లా అనిపించకుండా ఆలోచింపజేసేలా.. చురుకు పుట్టించేలా ఉంటాయి. పూరి ఏదైనా చెబుతుంటే వినబుద్ధేయడం ఆయన ప్రత్యేకత. ఐతే తన ఐడియాలజీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాలు, సినిమా వేడుకలకు పరిమితం అయిపోకుండా ఇప్పుడో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు పూరి.
తమ భావాలు చెప్పడానికి ప్రముఖులు ఎంచుకున్న మీడియాలోకి పూరి కూడా వచ్చేశాడు. పోడ్కాస్ట్లో ఆయన అకౌంట్ తెరించారు. అందులో మ్యూజింగ్స్ పేరుతో తన భావాలు, అనుభవాలు, పాఠాలు పంచుకోవడానికి సిద్ధపడ్డారు. అరంగేట్రంలోనే చక్కటి ఆడియో మెసేజ్లతో తన అభిమానుల్ని ఆకర్షించారు పూరి. అందరూ గొప్ప అనుకునే అమెరికాకు అసలు చరిత్ర, సంస్కృతి అంటూ ఏమీ లేవని.. వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాల గురించి ఆలోచిస్తుంటారని.. కానీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న ఇండియన్స్ వాటిలోకి వెళ్లకుండా, కొత్తగా ఏ ప్రయత్నమూ చేయకుండా కష్టం తెలియకుండా కాలం గడిపేస్తుంటారని అన్నాడు పూరి.
జనాభా పెరుగుదలతో వస్తున్న కష్టాల గురించి కూడా ఇందులో పూరి చక్కగా వివరించాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్ మీద కూడా ఆసక్తికర ఆడియో సందేశం పెట్టాడు. ఇవి విన్న ఎవరైనా.. ఇక రెగ్యులర్గా పోడ్కాస్ట్లో పూరీని ఫాలో అయిపోవాల్సిందే అనుకుంటారు. ప్రకాష్ రాజ్ సహా అందరూ పూరి ఫ్యాన్స్కు ఇదే పిలుపునిచ్చారు.
This post was last modified on July 21, 2020 10:53 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…