బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా మారిపోయి పొలం పనులన్నీ చేసేస్తున్నాడు.
ముంబయి శివార్లలో అతడికి భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో కొన్ని రోజులుగా తన సన్నిహితులతో కలిసి సల్మాన్ ఫాం హౌస్లోనే ఉంటున్నాడు.
ముందు పొలాల మధ్య సరదాగా తిరిగాడు కానీ.. తర్వాత సీరియస్గా పొలం పనుల్లోకి దిగిపోయాడు. ఈ మధ్య ఒళ్లంతా మట్టి పూసుకున్న, వరి నాట్లు పట్టుకున్న ఫొటోలను సల్మాన్ షేర్ చేస్తే.. అతను షో చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
కానీ సల్మాన్ అవేమీ పట్టించుకోలేదు. తర్వా త ట్రాక్టర్ ఎక్కాడు. పొలం దున్నాడు. తాజాగా వరి నాట్లు చేత బట్టి నిజంగానే అందరితో కలిసి తనూ వాటిని నాటాడు. ఊరికే ఫొటోలు, వీడియోల కోసం అన్నట్లు కాకుండా సల్మాన్ మనస్ఫూర్తిగానే ఈ పని చేస్తున్నాడని తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
షూటింగ్స్ లేకుంటే ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండే సెలబ్రెటీలకు.. ఇలా స్వేచ్ఛగా తిరిగే, వ్యవసాయం చేసే అవకాశం వస్తే దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు అనడానికి సల్మాన్ రుజువులా కనిపిస్తున్నాడు. సల్మాన్లో ఎన్నడూ చూడని ఈ కోణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిగతా సెలబ్రెటీలకు కూడా సల్మాన్లాగా పొలం పనులు చేయాలని అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 21, 2020 10:50 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…