బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా మారిపోయి పొలం పనులన్నీ చేసేస్తున్నాడు.
ముంబయి శివార్లలో అతడికి భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో కొన్ని రోజులుగా తన సన్నిహితులతో కలిసి సల్మాన్ ఫాం హౌస్లోనే ఉంటున్నాడు.
ముందు పొలాల మధ్య సరదాగా తిరిగాడు కానీ.. తర్వాత సీరియస్గా పొలం పనుల్లోకి దిగిపోయాడు. ఈ మధ్య ఒళ్లంతా మట్టి పూసుకున్న, వరి నాట్లు పట్టుకున్న ఫొటోలను సల్మాన్ షేర్ చేస్తే.. అతను షో చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
కానీ సల్మాన్ అవేమీ పట్టించుకోలేదు. తర్వా త ట్రాక్టర్ ఎక్కాడు. పొలం దున్నాడు. తాజాగా వరి నాట్లు చేత బట్టి నిజంగానే అందరితో కలిసి తనూ వాటిని నాటాడు. ఊరికే ఫొటోలు, వీడియోల కోసం అన్నట్లు కాకుండా సల్మాన్ మనస్ఫూర్తిగానే ఈ పని చేస్తున్నాడని తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
షూటింగ్స్ లేకుంటే ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండే సెలబ్రెటీలకు.. ఇలా స్వేచ్ఛగా తిరిగే, వ్యవసాయం చేసే అవకాశం వస్తే దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు అనడానికి సల్మాన్ రుజువులా కనిపిస్తున్నాడు. సల్మాన్లో ఎన్నడూ చూడని ఈ కోణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిగతా సెలబ్రెటీలకు కూడా సల్మాన్లాగా పొలం పనులు చేయాలని అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…