బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా మారిపోయి పొలం పనులన్నీ చేసేస్తున్నాడు.
ముంబయి శివార్లలో అతడికి భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో కొన్ని రోజులుగా తన సన్నిహితులతో కలిసి సల్మాన్ ఫాం హౌస్లోనే ఉంటున్నాడు.
ముందు పొలాల మధ్య సరదాగా తిరిగాడు కానీ.. తర్వాత సీరియస్గా పొలం పనుల్లోకి దిగిపోయాడు. ఈ మధ్య ఒళ్లంతా మట్టి పూసుకున్న, వరి నాట్లు పట్టుకున్న ఫొటోలను సల్మాన్ షేర్ చేస్తే.. అతను షో చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
కానీ సల్మాన్ అవేమీ పట్టించుకోలేదు. తర్వా త ట్రాక్టర్ ఎక్కాడు. పొలం దున్నాడు. తాజాగా వరి నాట్లు చేత బట్టి నిజంగానే అందరితో కలిసి తనూ వాటిని నాటాడు. ఊరికే ఫొటోలు, వీడియోల కోసం అన్నట్లు కాకుండా సల్మాన్ మనస్ఫూర్తిగానే ఈ పని చేస్తున్నాడని తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
షూటింగ్స్ లేకుంటే ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండే సెలబ్రెటీలకు.. ఇలా స్వేచ్ఛగా తిరిగే, వ్యవసాయం చేసే అవకాశం వస్తే దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు అనడానికి సల్మాన్ రుజువులా కనిపిస్తున్నాడు. సల్మాన్లో ఎన్నడూ చూడని ఈ కోణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిగతా సెలబ్రెటీలకు కూడా సల్మాన్లాగా పొలం పనులు చేయాలని అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 21, 2020 10:50 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…