బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా మారిపోయి పొలం పనులన్నీ చేసేస్తున్నాడు.
ముంబయి శివార్లలో అతడికి భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో కొన్ని రోజులుగా తన సన్నిహితులతో కలిసి సల్మాన్ ఫాం హౌస్లోనే ఉంటున్నాడు.
ముందు పొలాల మధ్య సరదాగా తిరిగాడు కానీ.. తర్వాత సీరియస్గా పొలం పనుల్లోకి దిగిపోయాడు. ఈ మధ్య ఒళ్లంతా మట్టి పూసుకున్న, వరి నాట్లు పట్టుకున్న ఫొటోలను సల్మాన్ షేర్ చేస్తే.. అతను షో చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
కానీ సల్మాన్ అవేమీ పట్టించుకోలేదు. తర్వా త ట్రాక్టర్ ఎక్కాడు. పొలం దున్నాడు. తాజాగా వరి నాట్లు చేత బట్టి నిజంగానే అందరితో కలిసి తనూ వాటిని నాటాడు. ఊరికే ఫొటోలు, వీడియోల కోసం అన్నట్లు కాకుండా సల్మాన్ మనస్ఫూర్తిగానే ఈ పని చేస్తున్నాడని తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
షూటింగ్స్ లేకుంటే ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండే సెలబ్రెటీలకు.. ఇలా స్వేచ్ఛగా తిరిగే, వ్యవసాయం చేసే అవకాశం వస్తే దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు అనడానికి సల్మాన్ రుజువులా కనిపిస్తున్నాడు. సల్మాన్లో ఎన్నడూ చూడని ఈ కోణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిగతా సెలబ్రెటీలకు కూడా సల్మాన్లాగా పొలం పనులు చేయాలని అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 21, 2020 10:50 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…