తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథ అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలను చూశాక రాజమౌళికి ‘మహాభారతం’ తీయడం అంత కష్టమేమీ కాదని.. ఒకవేళ అది చాలా కష్టమైనా కూడా సాధించగలడని అందరూ నమ్ముతున్నారు.
ఇప్పటికే భారతీయ వెండితెరపై, బుల్లితెరపై మహాభారత గాథను చూసినప్పటికీ.. జక్కన్న మెగా విజన్తో ఆ కథను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఐతే బాహుబలి చేయడానికి ముందు.. ‘మహాభారతం’ తీయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందని జక్కన్న చెప్పాడు. కానీ ఆ పదేళ్లు పూర్తవడానికి సమయం దగ్గర పడుతున్నా మహాభారతం ఊసు ఎత్తట్లేదు.
ఐతే ఈ మెగా ప్రాజెక్టు ఆలస్యం అయితే అయింది కానీ.. దాని వల్ల ఒక మంచి జరిగిందని చెప్పాలి. ఇప్పటిదాకా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టును తెరపై చూడడానికి భారతీయ ప్రేక్షకులు మాత్రమే ఎగ్జైట్ అవుతూ వచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రేక్ష్ఖకులు సైతం ఆయన పేరెత్తితే ఊగిపోతున్నారు. భారతీయులంతా ఎంతో గర్వించే మహాభారత కథను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించడానికి అవకాశం దక్కింది.
బేసిగ్గా మహాభారత కథలోనే గొప్ప విషయం ఉంది. అందులో క్యారెక్టర్లు, ఉపకథలు, మలుపులు అద్భుతం అనే చెప్పాలి. అలాంటి కథను రాజమౌళి తన విజన్తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తే దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రపంచం కూడా ఆ కథలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుంటుంది. రాజమౌళి మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లకు ఆకాశామే హద్దు అవుతుంది. కొన్ని భాగాలుగా తెరకెక్కే ఆ సినిమాను పూర్తి చేస్తే జక్కన్న కెరీర్కు అంతకుమించి సార్థకత లేకపోవచ్చు. మహేష్ బాబు సినిమా అవ్వగానే ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశిద్దాం.
This post was last modified on January 18, 2023 10:43 am
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…