తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథ అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలను చూశాక రాజమౌళికి ‘మహాభారతం’ తీయడం అంత కష్టమేమీ కాదని.. ఒకవేళ అది చాలా కష్టమైనా కూడా సాధించగలడని అందరూ నమ్ముతున్నారు.
ఇప్పటికే భారతీయ వెండితెరపై, బుల్లితెరపై మహాభారత గాథను చూసినప్పటికీ.. జక్కన్న మెగా విజన్తో ఆ కథను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఐతే బాహుబలి చేయడానికి ముందు.. ‘మహాభారతం’ తీయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందని జక్కన్న చెప్పాడు. కానీ ఆ పదేళ్లు పూర్తవడానికి సమయం దగ్గర పడుతున్నా మహాభారతం ఊసు ఎత్తట్లేదు.
ఐతే ఈ మెగా ప్రాజెక్టు ఆలస్యం అయితే అయింది కానీ.. దాని వల్ల ఒక మంచి జరిగిందని చెప్పాలి. ఇప్పటిదాకా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టును తెరపై చూడడానికి భారతీయ ప్రేక్షకులు మాత్రమే ఎగ్జైట్ అవుతూ వచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రేక్ష్ఖకులు సైతం ఆయన పేరెత్తితే ఊగిపోతున్నారు. భారతీయులంతా ఎంతో గర్వించే మహాభారత కథను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించడానికి అవకాశం దక్కింది.
బేసిగ్గా మహాభారత కథలోనే గొప్ప విషయం ఉంది. అందులో క్యారెక్టర్లు, ఉపకథలు, మలుపులు అద్భుతం అనే చెప్పాలి. అలాంటి కథను రాజమౌళి తన విజన్తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తే దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రపంచం కూడా ఆ కథలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుంటుంది. రాజమౌళి మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లకు ఆకాశామే హద్దు అవుతుంది. కొన్ని భాగాలుగా తెరకెక్కే ఆ సినిమాను పూర్తి చేస్తే జక్కన్న కెరీర్కు అంతకుమించి సార్థకత లేకపోవచ్చు. మహేష్ బాబు సినిమా అవ్వగానే ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశిద్దాం.
This post was last modified on January 18, 2023 10:43 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…