ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబోలో భారీ ప్యాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న దిల్ రాజు ఇకపై కూడా ఇలాంటి గ్రాండ్ స్కేల్ ఎంటర్ టైనర్స్ కొనసాగించేలా కనిపిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొందుతున్న సలార్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రషెస్ చూసిన వాళ్ళు ఇది కెజిఎఫ్ కు పదింతలు ఉంటుందని తెగ ఊరించేస్తున్నారు. సెప్టెంబర్ రిలీజ్ కు ఆల్రెడీ ఫిక్స్ అయిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒకవేళ ఆది పురుష్ ప్లాన్ లో ఏదైనా మార్పు ఉంటే తప్ప చెప్పిన డేట్ కి ఖచ్చితంగా వచ్చేస్తుంది
ఎలాగూ ఫలితం మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేయకూడదన్న ఆలోచనతో దిల్ రాజు ఈ ఇద్దరిని ఒక ప్రాజెక్టు కోసం లాక్ చేశారట. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ పలు సందర్భాల్లో ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఏదో ఒక రూపంలో ఇలాంటివి బయటికి వస్తున్నాయి. దాని ప్రకారం సోషియో ఫాంటసీ జానర్ లో మైథాలజీని టచ్ చేస్తూ ఓ కథ సబ్జెక్టుని సిద్ధం చేస్తున్నారట. అయితే ఇది అంత ఈజీగా పట్టాలు ఎక్కదు. సలార్ తర్వాత ప్రభాస్ మారుతీ సినిమా, ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా స్పిరిట్ పూర్తి చేయాలి. ఆలోగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ 30 కంప్లీట్ చేసుకుని ఉండాలి.
ఇక్కడ చెప్పినంత తేలిగ్గా ఇవన్నీ జరగవు. సో ఒకవేళ నిజం కావాలన్నా 2024 తర్వాతే సాధ్యమవుతుంది కానీ అంతకన్నా త్వరగా అంటే డౌటే. దిల్ రాజు చాలా ప్లాన్డ్ గా సినిమాలు సెట్ చేస్తున్నారు. హోంబాలే, మైత్రి లాంటి బ్యానర్లు వందల కోట్ల పెట్టుబడులతో దూసుకుపోతుండటంతో తన ఎస్విసిని ఇంకాస్త బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఇవే కాదు ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలనులతో సైతం భారీ గ్రాండియర్లను ప్లాన్ చేస్తున్నారట. చిన్న సినిమాలకు గీతా ఆర్ట్స్ 2 లాగా ఇంకో కొత్త బ్యానర్ మొదలుపెట్టారు కాబట్టి భారీ చిత్రాలకు మాత్రం పెద్ద బ్యానర్ ని అంకితం చేసేసి దానిపై గ్రాండియర్లను మాత్రమే నిర్మించే ప్లానింగ్ కనిపిస్తోంది.
This post was last modified on January 17, 2023 9:21 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…