గత ఏడాది వేసవిలో ‘ఆచార్య’, దసరాకి ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో పలకరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సంక్రాంతికి ఆయన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతోంది. నెక్స్ట్ బిగ్ సీజన్ అయిన వేసవికి కూడా ఆయన సినిమా వస్తుందని అనుకున్నారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు చిన్న షాక్ ఇచ్చాడు చిరు. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావట్లేదని ఆయన తేల్చేశాడు.
ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ 30 శాతమే పూర్తయిందని.. ఈ నెల 17 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అప్డేట్ ఇచ్చిన చిరు.. కుదిరితే మేలో ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తెస్తారని వెల్లడించాడు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే దసరా రిలీజ్ మీద దృష్టిసారిస్తామని చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.
ఏప్రిల్ 14కు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’తో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు చిరు సినిమా కూడా వస్తుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడది వాయిదా పడిపోయింది. ఇంకా 30 శాతం షూటింగే పూర్తయిన నేపథ్యంలో చిరు అన్నట్లు మేలో రావడం కూడా సందేహమే.
దసరా రిలీజ్కు ఫిక్సయిపోవచ్చు. చిరు ఈ మధ్య చేసిన సినిమాల్లో అతి తక్కువ అంచనాలున్నది ‘భోళా శంకర్’ మీదే. తమిళంలో ఎప్పుడో వచ్చిన రొటీన్ మాస్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ కావడం.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తుండడంతో దీనిపై చిరు అభిమానుల్లోనే పెద్దగా ఆశలు, అంచనాలు లేవు.
సిస్టర్ సెంటిమెంట్ కథతో తెరకెెక్కుతున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్, ఆయనకు జోడీగా తమన్నా భాటియా నటిస్తున్నారు. అనిల్ సుంకర, కేఎస్ రామారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on January 12, 2023 10:07 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…