Movie News

భోళా శంకర్.. చిన్న షాక్ ఇచ్చాడు చిరు

గత ఏడాది వేసవిలో ‘ఆచార్య’, దసరాకి ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో పలకరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సంక్రాంతికి ఆయన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతోంది. నెక్స్ట్ బిగ్ సీజన్ అయిన వేసవికి కూడా ఆయన సినిమా వస్తుందని అనుకున్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు చిన్న షాక్ ఇచ్చాడు చిరు. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావట్లేదని ఆయన తేల్చేశాడు.

ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ 30 శాతమే పూర్తయిందని.. ఈ నెల 17 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అప్‌డేట్ ఇచ్చిన చిరు.. కుదిరితే మేలో ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తెస్తారని వెల్లడించాడు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే దసరా రిలీజ్ మీద దృష్టిసారిస్తామని చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

ఏప్రిల్ 14కు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’తో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు చిరు సినిమా కూడా వస్తుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడది వాయిదా పడిపోయింది. ఇంకా 30 శాతం షూటింగే పూర్తయిన నేపథ్యంలో చిరు అన్నట్లు మేలో రావడం కూడా సందేహమే.

దసరా రిలీజ్‌కు ఫిక్సయిపోవచ్చు. చిరు ఈ మధ్య చేసిన సినిమాల్లో అతి తక్కువ అంచనాలున్నది ‘భోళా శంకర్’ మీదే. తమిళంలో ఎప్పుడో వచ్చిన రొటీన్ మాస్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ కావడం.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తుండడంతో దీనిపై చిరు అభిమానుల్లోనే పెద్దగా ఆశలు, అంచనాలు లేవు.

సిస్టర్ సెంటిమెంట్ కథతో తెరకెెక్కుతున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్, ఆయనకు జోడీగా తమన్నా భాటియా నటిస్తున్నారు. అనిల్ సుంకర, కేఎస్ రామారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

This post was last modified on January 12, 2023 10:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

2 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

4 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

4 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

6 hours ago