చిన్న సినిమాలకు స్టార్ట్స్ వచ్చి ప్రమోషన్ చేస్తే అన్నో ఇన్నో టికెట్లు తెగి సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న హీరోలు ఎప్పటికప్పుడు తమ సినిమాకి స్టార్స్ సపోర్ట్ కోరుకుంటారు. ఇక సంక్రాంతి సీజన్ లో అయితే ఏ చిన్న సినిమాకైనా పెద్ద సపోర్ట్ ఉండాల్సిందే. మరో నాలుగు రోజుల్లో బడా సినిమాల మధ్య థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ కి కూడా తాజాగా ప్రభాస్ సపోర్ట్ దక్కింది. తనకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శోభన్ తనయుడు, పైగా యూవీ నిర్మించిన సినిమా కావడంతో ప్రభాస్ సపోర్ట్ ఈ చిన్న సినిమాకు గట్టిగా ఉంటుందని అందరూ భావించారు.
కానీ ప్రభాస్ తో టీం వెడ్డింగ్ సాంగ్ మాత్రమే లాంచ్ చేయించుకొని ఊహించని విధంగా వాడుకున్నారు. అది కూడా డిజిటల్ రిలీజ్ మాత్రమే. ఇలా కాకుండా టీంతో ప్రభాస్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. గతంలో పూరీ జగన్నాథ్ కోసం ఆకాష్ ను, హీరోయిన్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి ఆ సినిమాకి సోషల్ మీడియాలో కావలసినంత ప్రమోషన్ చేసి పెట్టాడు. ఆ స్టైల్ లో సంతోష్ శోభన్ తో కూడా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ చేస్తే సంక్రాంతి సినిమాకి కలిసొచ్చేది. ఈ సినిమాకి కొంత బజ్ వచ్చేది.
కనీసం ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ప్లాన్ చేసుకోవాల్సింది. మొన్న అనుష్క తో ట్రైలర్ లాంచ్ చేయించి ఇప్పుడు ప్రభాస్ తో జస్ట్ ఓ సాంగ్ లాంచ్ చేయించుకోవడం యూవీ రాంగ్ స్ట్రాటజీనే. ఏదేమైనా బడా సినిమాల మధ్య తమకి కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తే చాలులే అనుకుంటున్నట్టున్నారు యూవీ నిర్మాతలు. లేదంటే ప్రమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ఐడియాలు రావాంటారా?
This post was last modified on January 11, 2023 9:17 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…