కరోనా కారణంగా 2020 తర్వాత గత రెండు సంక్రాంతులు కళ తప్పాయి. 2021లో సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడవగా.. ఆ ఏడాది మరీ భారీ చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతికి రావాల్సింది కానీ.. కొన్ని రోజుల ముందే కరోనా మూడో వేవ్ తాకిడి పెరగడంతో ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కానీ 2023 సంక్రాంతి మాత్రం ప్రేక్షకులను నిరాశ పరచట్లేదు. ఎప్పట్లా రెండు భారీ చిత్రాలు సంక్రాంతికి షెడ్యూల్ అయ్యాయి. అవి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలు కావడంతో బాక్సాఫీస్ ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. సంక్రాంతికి ఇలా రెండు పెద్ద సినిమాలు రిలీజైనా.. వాటితో పాటు ఒకట్రెండు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు రావడం మామూలే. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు పరిస్థితి.
కానీ చిరు, బాలయ్యల సినిమాలకున్న హైప్ చూస్తుంటే.. వాటి ముందు మిగతా సినిమాలు అస్సలు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా మూడు చిత్రాల్లో బజ్ తక్కువున్నది అంటే.. అనువాద చిత్రం ‘తెగింపు’నే. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తెలుగులో అసలు ప్రమోషన్ అన్నదే లేదు. కాకపోతే ఆ చిత్రానికి 11న సోలో రిలీజ్ ఛాన్స్ దక్కింది. ఆ ఒక్క రోజు ఓ మోస్తరుగా వసూళ్లను రాబట్టుకునే ఛాన్సుంది. కానీ తర్వాతి రోజు నుంచి ఆ చిత్రానికి థియేటర్లు మిగలవు.
12, 13 తారీఖుల్లో చిరు, బాలయ్యల సినిమాలు వస్తున్నాయి. ఆ రెండు రోజుల వాటికి మాగ్జిమం థియేటర్లు ఇచ్చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ట్రైలర్లూ మాస్కు విందు భోజనంలా అనిపించాయి. అభిమానులకు కూడా పండుగ గ్యారెంటీ అనిపిస్తోంది. ఇవి థియేటర్లలోకి దిగాక వేరే సినిమా వైపు ప్రేక్షకులు చూడడం కష్టమే. రెండు సినిమాలకు మించి పండక్కి డబ్బులు పెట్టడానికి కూడా జనాలు ఇష్టపడరు. ఈ రెండూ మినిమం గ్యారెంటీ సినిమాల్లా అనిపిస్తున్నాయి. కాబట్టి టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాలకు జనాలు వెళ్లిపోవడం పక్కా. ఇవి అందుబాటులో ఉండగా.. డబ్బింగ్ మూవీ ‘వారసుడు’ను, సంక్రాంతి బరిలో ఉన్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ను జనాలు పట్టించుకుంటారా అన్నది సందేహమే. టాక్ ఓ మోస్తరుగా ఉన్నా చాలు.. చిరు, బాలయ్యల సినిమాలు మిగతా వాటిని తొక్కుకుంటూ వెళ్లిపోవడం గ్యారెంటీ.
This post was last modified on January 10, 2023 5:36 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…