ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా బాగానే నిలదొక్కుకున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. అతడి తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుని అతడికి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత తనే రచయితగా మారి, మేకింగ్ విషయంలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ యువత దృష్టిని బాగానే ఆకర్షించింది. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని కిరణ్కు యూత్లో ఉన్న ఫాలోయింగ్ను చాటిచెప్పింది. దీంతో వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడతను. కానీ అతడి తర్వాతి చిత్రాల్లో సమ్మతమే ఒక్కటే ఓ మోస్తరుగా ఆడింది. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే అతడి జోరేమీ తగ్గలేదు. ఇంకో మూణ్నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.
అందులో ఒకటైన వినరో భాగ్యము విష్ణు కథ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కిరణ్కు ఒక నెటిజన్ పెట్టిన మీమ్ పోస్టు హర్టింగ్గా అనిపించింది. వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజను పక్కన పెట్టుకుని చిరంజీవి ఒక కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా, గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్నది తామిద్దరమే అన్నాడు.
ఐతే ఇందులో చిరు తలకు కిరణ్ అబ్బవరం, రవితేజ తలకు ఆది సాయికుమార్ ముఖాలు పెట్టి.. ఈ ఇద్దరి మీద కౌంటర్ వేశాడు ఒక నెటిజన్. గ్యాప్ లేకుండా తామిద్దరం సినిమాలు తీసి జనాల మీదికి వదిలేస్తున్నట్లుగా ఈ పోస్టు ఉండడంతో కిరణ్ హర్టయినట్లున్నాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలో అయిదు సినిమాలు చేశానని.. ఇవి కాకుండా తన పేరు మీద ఏవైనా సినిమాలు రిలీజయ్యాయేమో తెలియదని.. దీనికి జవాబు చెప్పాలని అన్నాడు కిరణ్. ఐతే ఆ నెటిజన్ ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు. గత ఏడాది కిరణ్ సినిమాలు 3 రిలీజ్ కాగా.. ఈ ఏడాది కూడా అంతకంటే తక్కువ సినిమాలు వచ్చేలా కనిపించడం లేదు.
This post was last modified on January 9, 2023 10:29 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…