సినిమాల రేటింగ్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఫాలో అయ్యే ఐఎండిబి ప్రామాణికత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య స్టాండర్డ్స్ కి సంబంధించి కొన్ని అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ బ్రాండ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ 2022 టాప్ 10 ఇండియన్ యాక్టర్స్ ని ప్రకటించినప్పుడు దాని ప్రాధాన్యత క్రమంలో అర్హత లేని ఒకరిద్దరికి చోటు దక్కడం గురించి విమర్శలైతే వచ్చాయి. తాజాగా ఈ ఏడాది అత్యధికంగా ఇండియన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టాప్ 20 సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలున్నాయి.
మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్షా మూవీ కావడంతో ఆ మాత్రం గౌరవం దక్కడం సముచితమే. రెండో ప్లేస్ లో పుష్ప ది రూల్ పార్ట్ 2 ఉంది. ఒక డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో నార్త్ క్రేజ్ ఉండటం చాలా అరుదు. తర్వాత వరసగా మూడు నుంచి పది ర్యాంకుల్లో జవాన్, ఆది పురుష్, సలార్, వారసుడు, కబ్జా, విజయ్ 67, ది ఆర్చీస్, డుంకీ ఉన్నాయి. వీటిలో రెండు డార్లింగ్ ప్రభాస్ వి ఉండటం గమనార్హం. తర్వాత టైగర్ 3, కిసీకా భాయ్ కిసీకా జాన్, తెగింపు, యానిమల్, ఏజెంట్, ఇండియన్ 2, వడివాసల్, షెహజాదా, బడే మియా చోటే మియా 2, భోళా ఉన్నాయి.
ట్విస్ట్ ఏంటంటే ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు రామ్ చరణ్ 15, ఎన్టీఆర్ 30 ఈ లిస్టులో లేవు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకూ చోటు దక్కలేదు. అఖిల్ ఉండటం చూస్తే ఏజెంట్ మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాను రాను ఐఎండిబిల సమాచారం పూర్తి స్థాయి స్టాండర్డ్ లో ఉన్నట్టు అనిపించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం హీరోల క్రేజ్ ను చూసి ఇలా పెడుతున్నారు తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ప్రేక్షకుల అంచనాలు విశ్లేషణలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. సరే ఐఎండిబి అంటే అదో బ్రాండ్ కాబట్టి ప్రస్తుతానికి ఇలా చెల్లిపోతోంది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…