సినిమాల రేటింగ్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఫాలో అయ్యే ఐఎండిబి ప్రామాణికత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య స్టాండర్డ్స్ కి సంబంధించి కొన్ని అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ బ్రాండ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ 2022 టాప్ 10 ఇండియన్ యాక్టర్స్ ని ప్రకటించినప్పుడు దాని ప్రాధాన్యత క్రమంలో అర్హత లేని ఒకరిద్దరికి చోటు దక్కడం గురించి విమర్శలైతే వచ్చాయి. తాజాగా ఈ ఏడాది అత్యధికంగా ఇండియన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టాప్ 20 సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలున్నాయి.
మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్షా మూవీ కావడంతో ఆ మాత్రం గౌరవం దక్కడం సముచితమే. రెండో ప్లేస్ లో పుష్ప ది రూల్ పార్ట్ 2 ఉంది. ఒక డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో నార్త్ క్రేజ్ ఉండటం చాలా అరుదు. తర్వాత వరసగా మూడు నుంచి పది ర్యాంకుల్లో జవాన్, ఆది పురుష్, సలార్, వారసుడు, కబ్జా, విజయ్ 67, ది ఆర్చీస్, డుంకీ ఉన్నాయి. వీటిలో రెండు డార్లింగ్ ప్రభాస్ వి ఉండటం గమనార్హం. తర్వాత టైగర్ 3, కిసీకా భాయ్ కిసీకా జాన్, తెగింపు, యానిమల్, ఏజెంట్, ఇండియన్ 2, వడివాసల్, షెహజాదా, బడే మియా చోటే మియా 2, భోళా ఉన్నాయి.
ట్విస్ట్ ఏంటంటే ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు రామ్ చరణ్ 15, ఎన్టీఆర్ 30 ఈ లిస్టులో లేవు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకూ చోటు దక్కలేదు. అఖిల్ ఉండటం చూస్తే ఏజెంట్ మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాను రాను ఐఎండిబిల సమాచారం పూర్తి స్థాయి స్టాండర్డ్ లో ఉన్నట్టు అనిపించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం హీరోల క్రేజ్ ను చూసి ఇలా పెడుతున్నారు తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ప్రేక్షకుల అంచనాలు విశ్లేషణలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. సరే ఐఎండిబి అంటే అదో బ్రాండ్ కాబట్టి ప్రస్తుతానికి ఇలా చెల్లిపోతోంది.
This post was last modified on January 9, 2023 5:22 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…