సంక్రాంతి కానుకగా విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్య నుంచి రెండు రోజుల కిందటే ట్రైలర్ వచ్చింది. అందులో చిరంజీవి ఊర మాస్ అవతారం.. ఆయన మేనరిజమ్స్.. డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని పంచ్ డైలాగులు భలేగా పేలాయి.
అందులో ఒకటి.. నేను రికార్డుల్లో ఉండడం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి అనే డైలాగ్. చిరంజీవి చూడని రికార్డుల్లేవు కాబట్టి అభిమానులు ఈ డైలాగ్తో బాగా కనెక్టయ్యారు. ఐతే ఈ డైలాగ్ కొత్తది కాకపోవడం, ఆల్రెడీ ఒక సినిమాలో ఉన్నదే కావడం విశేషం. మెగాస్టార్ మేనల్లుడైన సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ సినిమాలో సేమ్ డైలాగ్ ఉండడం గమనార్హం.
2017లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన విన్నర్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లో నటించాడు కమెడియన్ పృథ్వీ. అందులో ఆయన పాత్ర పేరు.. సింగం సుజాత. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సింగం సుజాత ఓ డైలాగ్ చెబుతాడ ” రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత.. సింగం సుజాత” అంటూ పవర్ ఫుల్గా ఉంటూనే సెటైరికల్గా ఈ డైలాగ్ రాశారు.
ఈ డైలాగ్నే యాజిటీజ్ వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో చిరంజీవి చెప్పడం చూసి అందరూ షాకవుతున్నారు. రెండు వీడియోలను పక్క పక్కన పెట్టి.. ఇంత గుడ్డిగా డైలాగ్ కాపీ కొట్టేశారేంటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దీనికి సమాంతరంగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రాన్ని రూపొందించింది విన్నర్ దర్శకుడే కావడం విశేషం. అయినా అతడి సినిమాలో ఈ డైలాగ్ ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడమేంటో?
This post was last modified on January 9, 2023 9:23 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…