‘బాహుబలి’తో ప్రభాస్ తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్, క్రేజ్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ స్థాయిలో ఎదిగిపోయిన హీరో ఎవ్వరూ కనిపించరు. ఐతే ఇదంతా బలుపా వాపా అనిపించేలా ప్రభాస్ తర్వాతి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘సాహో’కు ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చాయి కానీ.. ‘రాధేశ్యామ్’కు అది కూడా లేకపోయింది. దీంతో ప్రభాస్ గురించి కొంతమంది తేలిక చేసి మాట్లాడారు.
‘ఆదిపురుష్’ తాలూకు నెగెటివిటీ కూడా తోడై ప్రభాస్ ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. కానీ ఇప్పుడు కూడా సరైన సినిమా పడితే ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ రుచి చూస్తుందనే అంచనాతో ఉన్నారు అభిమానులు. సలార్, ప్రాజెక్ట్-కే సినిమాల మీద నెలకొన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు ప్రభాస్ స్టామినా ఏమి తగ్గిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.
‘ప్రాజెక్ట్-కే’కు సంబంధించి తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త.. ప్రభాస్ సత్తాకు నిదర్శనం. ఈ చిత్ర నైజాం హక్కులను చాలా ముందుగానే ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి నైజాం ఏరియా హక్కులను కొనేశాడట సునీల్. ఆ రేటు రూ.70 కోట్లని అంటున్నారు.
ఇప్పటిదాకా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక బిజినెస్ చేసింది. ఆ సినిమా కూడా రూ.70 కోట్లే పలికింది. రాజమౌళి సినిమా కాకపోయినా ‘ప్రాజెక్ట్-కే’ ఆ రికార్డును సమం చేసింది. ఇది ప్యూర్ ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటున్నారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. తన అల్లుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on January 4, 2023 9:32 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…