Movie News

రెండు డిజాస్టర్లు.. అయినా ప్రభాస్ తగ్గట్లా

‘బాహుబలి’తో ప్రభాస్ తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్, క్రేజ్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ స్థాయిలో ఎదిగిపోయిన హీరో ఎవ్వరూ కనిపించరు. ఐతే ఇదంతా బలుపా వాపా అనిపించేలా ప్రభాస్ తర్వాతి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘సాహో’కు ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చాయి కానీ.. ‘రాధేశ్యామ్’కు అది కూడా లేకపోయింది. దీంతో ప్రభాస్ గురించి కొంతమంది తేలిక చేసి మాట్లాడారు.

‘ఆదిపురుష్’ తాలూకు నెగెటివిటీ కూడా తోడై ప్రభాస్ ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. కానీ ఇప్పుడు కూడా సరైన సినిమా పడితే ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ రుచి చూస్తుందనే అంచనాతో ఉన్నారు అభిమానులు. సలార్, ప్రాజెక్ట్-కే సినిమాల మీద నెలకొన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు ప్రభాస్ స్టామినా ఏమి తగ్గిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.

‘ప్రాజెక్ట్-కే’కు సంబంధించి తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త.. ప్రభాస్ సత్తాకు నిదర్శనం. ఈ చిత్ర నైజాం హక్కులను చాలా ముందుగానే ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి నైజాం ఏరియా హక్కులను కొనేశాడట సునీల్. ఆ రేటు రూ.70 కోట్లని అంటున్నారు.

ఇప్పటిదాకా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక బిజినెస్ చేసింది. ఆ సినిమా కూడా రూ.70 కోట్లే పలికింది. రాజమౌళి సినిమా కాకపోయినా ‘ప్రాజెక్ట్-కే’ ఆ రికార్డును సమం చేసింది. ఇది ప్యూర్ ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటున్నారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. తన అల్లుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

This post was last modified on January 4, 2023 9:32 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago