‘బాహుబలి’తో ప్రభాస్ తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్, క్రేజ్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ స్థాయిలో ఎదిగిపోయిన హీరో ఎవ్వరూ కనిపించరు. ఐతే ఇదంతా బలుపా వాపా అనిపించేలా ప్రభాస్ తర్వాతి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘సాహో’కు ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చాయి కానీ.. ‘రాధేశ్యామ్’కు అది కూడా లేకపోయింది. దీంతో ప్రభాస్ గురించి కొంతమంది తేలిక చేసి మాట్లాడారు.
‘ఆదిపురుష్’ తాలూకు నెగెటివిటీ కూడా తోడై ప్రభాస్ ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. కానీ ఇప్పుడు కూడా సరైన సినిమా పడితే ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ రుచి చూస్తుందనే అంచనాతో ఉన్నారు అభిమానులు. సలార్, ప్రాజెక్ట్-కే సినిమాల మీద నెలకొన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు ప్రభాస్ స్టామినా ఏమి తగ్గిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.
‘ప్రాజెక్ట్-కే’కు సంబంధించి తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త.. ప్రభాస్ సత్తాకు నిదర్శనం. ఈ చిత్ర నైజాం హక్కులను చాలా ముందుగానే ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి నైజాం ఏరియా హక్కులను కొనేశాడట సునీల్. ఆ రేటు రూ.70 కోట్లని అంటున్నారు.
ఇప్పటిదాకా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక బిజినెస్ చేసింది. ఆ సినిమా కూడా రూ.70 కోట్లే పలికింది. రాజమౌళి సినిమా కాకపోయినా ‘ప్రాజెక్ట్-కే’ ఆ రికార్డును సమం చేసింది. ఇది ప్యూర్ ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటున్నారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. తన అల్లుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on January 4, 2023 9:32 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…