‘బాహుబలి’తో ప్రభాస్ తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్, క్రేజ్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ స్థాయిలో ఎదిగిపోయిన హీరో ఎవ్వరూ కనిపించరు. ఐతే ఇదంతా బలుపా వాపా అనిపించేలా ప్రభాస్ తర్వాతి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘సాహో’కు ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చాయి కానీ.. ‘రాధేశ్యామ్’కు అది కూడా లేకపోయింది. దీంతో ప్రభాస్ గురించి కొంతమంది తేలిక చేసి మాట్లాడారు.
‘ఆదిపురుష్’ తాలూకు నెగెటివిటీ కూడా తోడై ప్రభాస్ ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. కానీ ఇప్పుడు కూడా సరైన సినిమా పడితే ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ రుచి చూస్తుందనే అంచనాతో ఉన్నారు అభిమానులు. సలార్, ప్రాజెక్ట్-కే సినిమాల మీద నెలకొన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు ప్రభాస్ స్టామినా ఏమి తగ్గిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.
‘ప్రాజెక్ట్-కే’కు సంబంధించి తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త.. ప్రభాస్ సత్తాకు నిదర్శనం. ఈ చిత్ర నైజాం హక్కులను చాలా ముందుగానే ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి నైజాం ఏరియా హక్కులను కొనేశాడట సునీల్. ఆ రేటు రూ.70 కోట్లని అంటున్నారు.
ఇప్పటిదాకా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక బిజినెస్ చేసింది. ఆ సినిమా కూడా రూ.70 కోట్లే పలికింది. రాజమౌళి సినిమా కాకపోయినా ‘ప్రాజెక్ట్-కే’ ఆ రికార్డును సమం చేసింది. ఇది ప్యూర్ ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటున్నారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. తన అల్లుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…