సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే అన్ని సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నుండి రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ ప్రాబ్లం గండం వచ్చి పడిందట.
బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. పర్మిషన్ అప్లై చేసి అక్కడ వర్క్ మొదలు పెట్టేశారు కూడా. ఇక వాల్తేరు వీరయ్య కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ అనుకోకుండా రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ సమస్య ఎదురైందని ఇన్సైడ్ టాక్. వీర సింహా రెడ్డి ఈవెంట్ కి వచ్చే భారీ పబ్లిక్ ఒంగోల్ గ్రౌండ్ లో ఆపలేమని, అంత మందిని గ్రౌండ్ లో పెట్టి ఈవెంట్ చేయడం ఇంపాజిబుల్ అని పోలీస్ లు పర్మిషన్ కి నిరాకరించారని తెలుస్తుంది.
ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ కి పర్మిషన్ ఇచ్చేందుకు అక్కడ పోలీస్ శాఖ నిరాకరించిందని సమాచారం. దీంతో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ కి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదారాబాద్ కి షిఫ్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
This post was last modified on January 4, 2023 9:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…