సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే అన్ని సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నుండి రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ ప్రాబ్లం గండం వచ్చి పడిందట.
బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. పర్మిషన్ అప్లై చేసి అక్కడ వర్క్ మొదలు పెట్టేశారు కూడా. ఇక వాల్తేరు వీరయ్య కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ అనుకోకుండా రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ సమస్య ఎదురైందని ఇన్సైడ్ టాక్. వీర సింహా రెడ్డి ఈవెంట్ కి వచ్చే భారీ పబ్లిక్ ఒంగోల్ గ్రౌండ్ లో ఆపలేమని, అంత మందిని గ్రౌండ్ లో పెట్టి ఈవెంట్ చేయడం ఇంపాజిబుల్ అని పోలీస్ లు పర్మిషన్ కి నిరాకరించారని తెలుస్తుంది.
ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ కి పర్మిషన్ ఇచ్చేందుకు అక్కడ పోలీస్ శాఖ నిరాకరించిందని సమాచారం. దీంతో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ కి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదారాబాద్ కి షిఫ్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
This post was last modified on January 4, 2023 9:28 pm
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…