ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అయితే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తమకు ఇష్టం వచ్చిన తినుబండారాలను తీసుకెళ్లవచ్చు. దాన్ని థియేటర్ల యాజమాన్యాలు అడ్డుకోజాలవు. ఐతే ఈ నిబంధనను పాటించే థియేటర్లు తక్కువ. చాలా వరకు బయటి తినుబండారాలను థియేటర్ల యాజమాన్యాలు అనుమతించవు. ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా లేదా.. బయట ఏమైనా కొని తెచ్చుకున్నా వాటిని తీసి కౌంటర్లలో పెట్టి తర్వాత తీసుకెళ్లమంటారు.
ఐతే ఇప్పటిదాకా నిబంధనల గురించి అవగాహన ఉన్న వాళ్లు తమ వెంట నచ్చిన తినుబండారాలను థియేటర్లలోకి తీసుకెళ్లేవాళ్లు. ఈ విషయమై తరచుగా థియేటర్ల దగ్గర ఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజామాన్యాల తరఫున వేసిన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి తినుబండారాలను తీసుకెళ్లడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చింది. వాటిని నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తాజాగా తీర్పు వెలువరించింది. థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసమని.. అలాంటి చోట బయటి ఫుడ్ తీసుకెళ్తే నియంత్రించే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోపల తినుబండారాలు నచ్చకుంటే వాటిని కొనకుండా మిన్నకుండే అవకాశం ప్రేక్షకులకు ఉంది కదా అని వ్యాఖ్యానించింది.
మరోవైపు థియేటర్లలో శుభ్రమైన మంచి నీరు ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. చిన్న పిల్లలకు అవసరమైన మేర తల్లిదండ్రులు ఫుడ్ తీసుకెళ్లేందుకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతించాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పు పట్ల థియేటర్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on January 4, 2023 6:15 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…