ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అయితే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తమకు ఇష్టం వచ్చిన తినుబండారాలను తీసుకెళ్లవచ్చు. దాన్ని థియేటర్ల యాజమాన్యాలు అడ్డుకోజాలవు. ఐతే ఈ నిబంధనను పాటించే థియేటర్లు తక్కువ. చాలా వరకు బయటి తినుబండారాలను థియేటర్ల యాజమాన్యాలు అనుమతించవు. ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా లేదా.. బయట ఏమైనా కొని తెచ్చుకున్నా వాటిని తీసి కౌంటర్లలో పెట్టి తర్వాత తీసుకెళ్లమంటారు.
ఐతే ఇప్పటిదాకా నిబంధనల గురించి అవగాహన ఉన్న వాళ్లు తమ వెంట నచ్చిన తినుబండారాలను థియేటర్లలోకి తీసుకెళ్లేవాళ్లు. ఈ విషయమై తరచుగా థియేటర్ల దగ్గర ఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజామాన్యాల తరఫున వేసిన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి తినుబండారాలను తీసుకెళ్లడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చింది. వాటిని నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తాజాగా తీర్పు వెలువరించింది. థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసమని.. అలాంటి చోట బయటి ఫుడ్ తీసుకెళ్తే నియంత్రించే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోపల తినుబండారాలు నచ్చకుంటే వాటిని కొనకుండా మిన్నకుండే అవకాశం ప్రేక్షకులకు ఉంది కదా అని వ్యాఖ్యానించింది.
మరోవైపు థియేటర్లలో శుభ్రమైన మంచి నీరు ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. చిన్న పిల్లలకు అవసరమైన మేర తల్లిదండ్రులు ఫుడ్ తీసుకెళ్లేందుకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతించాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పు పట్ల థియేటర్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on January 4, 2023 6:15 am
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…