ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అయితే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తమకు ఇష్టం వచ్చిన తినుబండారాలను తీసుకెళ్లవచ్చు. దాన్ని థియేటర్ల యాజమాన్యాలు అడ్డుకోజాలవు. ఐతే ఈ నిబంధనను పాటించే థియేటర్లు తక్కువ. చాలా వరకు బయటి తినుబండారాలను థియేటర్ల యాజమాన్యాలు అనుమతించవు. ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా లేదా.. బయట ఏమైనా కొని తెచ్చుకున్నా వాటిని తీసి కౌంటర్లలో పెట్టి తర్వాత తీసుకెళ్లమంటారు.
ఐతే ఇప్పటిదాకా నిబంధనల గురించి అవగాహన ఉన్న వాళ్లు తమ వెంట నచ్చిన తినుబండారాలను థియేటర్లలోకి తీసుకెళ్లేవాళ్లు. ఈ విషయమై తరచుగా థియేటర్ల దగ్గర ఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజామాన్యాల తరఫున వేసిన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి తినుబండారాలను తీసుకెళ్లడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చింది. వాటిని నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తాజాగా తీర్పు వెలువరించింది. థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసమని.. అలాంటి చోట బయటి ఫుడ్ తీసుకెళ్తే నియంత్రించే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోపల తినుబండారాలు నచ్చకుంటే వాటిని కొనకుండా మిన్నకుండే అవకాశం ప్రేక్షకులకు ఉంది కదా అని వ్యాఖ్యానించింది.
మరోవైపు థియేటర్లలో శుభ్రమైన మంచి నీరు ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. చిన్న పిల్లలకు అవసరమైన మేర తల్లిదండ్రులు ఫుడ్ తీసుకెళ్లేందుకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతించాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పు పట్ల థియేటర్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on January 4, 2023 6:15 am
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…