ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలతో కలిపి ఇప్పటికే ఆరు సినిమాలు ఎనౌన్స్ చేశారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లతో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ , రాహుల్ విజయ్ ‘వివాహం’ అనే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో నిలిచాయి.
‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు సంబందించి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. వీటి మధ్య చిన్న సినిమాలు ఆనడం లేదు. ‘కళ్యాణం కమనీయం’ ప్రమోషన్ మొదలు పెట్టి వారం దాటింది. ఇంత వరకు సినిమాపై బజ్ తీసుకురాలేకపోయారు మేకర్స్. ఇక 2023 సంక్రాంతి రేస్ లో ‘వివాహం’ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.
తాజాగా సమాచారం మేరకు రాహుల్ విజయ్ ,శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ‘వివాహం’ సంక్రాంతి నుండి తప్పుకుందట. అసలే నాలుగు బడా సినిమాలు, మధ్యలో యూవీ నిర్మించిన మీడియం రేంజ్ సినిమా కూడా ఉండటంతో ఈ చిన్న సినిమాకి ఓ మోస్తరు థియేటర్స్ కూడా దొరకడం లేదట. అందుకే సైలెంట్ గా నిర్మాతలు తమ సినిమాను జనవరి 26కి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్టు కొత్త రిలీజ్ డేట్ తో ప్రకటించే అవకాశం ఉంది.
ఏదేమైనా సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమాకి కొంతలో కొంత ప్రమోషన్ లభించింది. మరి జనవరి 26 న కూడా తెలుగులో గట్టి పోటీ ఉండబోతుంది. జనవరి 25న షారుక్ ఖాన్ పఠాన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక 26 న సుధీర్ బాబు హంట్ , సితార సంస్థ ‘బుట్ట బొమ్మ’ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో వివాహం ఎప్పుడొచ్చినా కాంపిటీషన్ తప్పని పరిస్థితి.
This post was last modified on January 3, 2023 3:06 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…