ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలతో కలిపి ఇప్పటికే ఆరు సినిమాలు ఎనౌన్స్ చేశారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లతో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ , రాహుల్ విజయ్ ‘వివాహం’ అనే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో నిలిచాయి.
‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు సంబందించి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. వీటి మధ్య చిన్న సినిమాలు ఆనడం లేదు. ‘కళ్యాణం కమనీయం’ ప్రమోషన్ మొదలు పెట్టి వారం దాటింది. ఇంత వరకు సినిమాపై బజ్ తీసుకురాలేకపోయారు మేకర్స్. ఇక 2023 సంక్రాంతి రేస్ లో ‘వివాహం’ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.
తాజాగా సమాచారం మేరకు రాహుల్ విజయ్ ,శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ‘వివాహం’ సంక్రాంతి నుండి తప్పుకుందట. అసలే నాలుగు బడా సినిమాలు, మధ్యలో యూవీ నిర్మించిన మీడియం రేంజ్ సినిమా కూడా ఉండటంతో ఈ చిన్న సినిమాకి ఓ మోస్తరు థియేటర్స్ కూడా దొరకడం లేదట. అందుకే సైలెంట్ గా నిర్మాతలు తమ సినిమాను జనవరి 26కి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్టు కొత్త రిలీజ్ డేట్ తో ప్రకటించే అవకాశం ఉంది.
ఏదేమైనా సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమాకి కొంతలో కొంత ప్రమోషన్ లభించింది. మరి జనవరి 26 న కూడా తెలుగులో గట్టి పోటీ ఉండబోతుంది. జనవరి 25న షారుక్ ఖాన్ పఠాన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక 26 న సుధీర్ బాబు హంట్ , సితార సంస్థ ‘బుట్ట బొమ్మ’ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో వివాహం ఎప్పుడొచ్చినా కాంపిటీషన్ తప్పని పరిస్థితి.
This post was last modified on January 3, 2023 3:06 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…