సంక్రాంతి పందెంలో థియేటర్ల విషయంలో సెంటర్ అఫ్ కాంట్రావర్సీగా నిలుస్తున్న వారసుడుకి ఇప్పటిదాకా తెలుగులో ఏమంత బజ్ లేదు. నిర్మాత దిల్ రాజు మంచి స్క్రీన్లను లాక్ చేస్తూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మీద వివక్ష చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తమది డబ్బింగ్ సినిమా అయినా హైప్ పెంచాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది. దానికి రెండే ఆయుధాలు. ఒకటి ట్రైలర్. రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో ఆ మధ్య ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంచనాలు పెంచడంలో అక్కడది బాగానే ఉపయోగపడింది.
కానీ విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తుపాకీ నుంచి బీస్ట్ దాకా హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నా మరీ చిరంజీవి బాలకృష్ణలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ ఎంత మాత్రం లేదు. పైగా వారసుడు స్టోరీ లైన్ మనమెన్నో సార్లు చూసిన టైపులోనే ఉంటుందని ఆల్రెడీ చెన్నై లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తే మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద చర్చ మొదలవుతుందని అంచనా. అయితే విజయ్ ఇప్పటిదాకా డబ్బింగ్ ప్రమోషన్ల కోసం ఏనాడూ హైదరాబాద్ రాలేదు. కానీ వారసుడు స్పెషల్ కేస్ కాబట్టి ప్రత్యేకంగా పరిగణిస్తాడు. తప్పదు.
వేదిక ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఎలా సమీకరించాలి. అతిథులుగా ఎవరైనా పిలవాలా వద్దా అనే అంశాల మీద దిల్ టీమ్ డిస్కషన్లో ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వేడుక జనవరి 6న ఒంగోలులో, వాల్తేరు వీరయ్య ఈవెంట్ 9న విశాఖపట్నంలో ఫిక్స్ చేశారు. అజిత్ తెగింపుకి ఏదో చిన్నగా లాగించేస్తారు కానీ వారసుడుకి మాత్రం అల్లాటప్పాగా చేస్తే కుదరదు. విజయ్ రావడం పక్కానే కానీ ఏం మాట్లాడతాడు, పబ్లిక్ కి ఏం సందేశం ఇస్తాడు, వీరయ్య వీరసింహాల ప్రస్తావన తెస్తాడా లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితి గురించి పోటీ గురించి తనకు అవగాహన ఉందో లేదో ?
This post was last modified on January 3, 2023 11:29 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…