సంక్రాంతి పందెంలో థియేటర్ల విషయంలో సెంటర్ అఫ్ కాంట్రావర్సీగా నిలుస్తున్న వారసుడుకి ఇప్పటిదాకా తెలుగులో ఏమంత బజ్ లేదు. నిర్మాత దిల్ రాజు మంచి స్క్రీన్లను లాక్ చేస్తూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మీద వివక్ష చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తమది డబ్బింగ్ సినిమా అయినా హైప్ పెంచాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది. దానికి రెండే ఆయుధాలు. ఒకటి ట్రైలర్. రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో ఆ మధ్య ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంచనాలు పెంచడంలో అక్కడది బాగానే ఉపయోగపడింది.
కానీ విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తుపాకీ నుంచి బీస్ట్ దాకా హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నా మరీ చిరంజీవి బాలకృష్ణలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ ఎంత మాత్రం లేదు. పైగా వారసుడు స్టోరీ లైన్ మనమెన్నో సార్లు చూసిన టైపులోనే ఉంటుందని ఆల్రెడీ చెన్నై లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తే మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద చర్చ మొదలవుతుందని అంచనా. అయితే విజయ్ ఇప్పటిదాకా డబ్బింగ్ ప్రమోషన్ల కోసం ఏనాడూ హైదరాబాద్ రాలేదు. కానీ వారసుడు స్పెషల్ కేస్ కాబట్టి ప్రత్యేకంగా పరిగణిస్తాడు. తప్పదు.
వేదిక ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఎలా సమీకరించాలి. అతిథులుగా ఎవరైనా పిలవాలా వద్దా అనే అంశాల మీద దిల్ టీమ్ డిస్కషన్లో ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వేడుక జనవరి 6న ఒంగోలులో, వాల్తేరు వీరయ్య ఈవెంట్ 9న విశాఖపట్నంలో ఫిక్స్ చేశారు. అజిత్ తెగింపుకి ఏదో చిన్నగా లాగించేస్తారు కానీ వారసుడుకి మాత్రం అల్లాటప్పాగా చేస్తే కుదరదు. విజయ్ రావడం పక్కానే కానీ ఏం మాట్లాడతాడు, పబ్లిక్ కి ఏం సందేశం ఇస్తాడు, వీరయ్య వీరసింహాల ప్రస్తావన తెస్తాడా లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితి గురించి పోటీ గురించి తనకు అవగాహన ఉందో లేదో ?
This post was last modified on January 3, 2023 11:29 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…