సంక్రాంతి పందెంలో థియేటర్ల విషయంలో సెంటర్ అఫ్ కాంట్రావర్సీగా నిలుస్తున్న వారసుడుకి ఇప్పటిదాకా తెలుగులో ఏమంత బజ్ లేదు. నిర్మాత దిల్ రాజు మంచి స్క్రీన్లను లాక్ చేస్తూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మీద వివక్ష చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తమది డబ్బింగ్ సినిమా అయినా హైప్ పెంచాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది. దానికి రెండే ఆయుధాలు. ఒకటి ట్రైలర్. రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో ఆ మధ్య ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంచనాలు పెంచడంలో అక్కడది బాగానే ఉపయోగపడింది.
కానీ విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తుపాకీ నుంచి బీస్ట్ దాకా హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నా మరీ చిరంజీవి బాలకృష్ణలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ ఎంత మాత్రం లేదు. పైగా వారసుడు స్టోరీ లైన్ మనమెన్నో సార్లు చూసిన టైపులోనే ఉంటుందని ఆల్రెడీ చెన్నై లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తే మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద చర్చ మొదలవుతుందని అంచనా. అయితే విజయ్ ఇప్పటిదాకా డబ్బింగ్ ప్రమోషన్ల కోసం ఏనాడూ హైదరాబాద్ రాలేదు. కానీ వారసుడు స్పెషల్ కేస్ కాబట్టి ప్రత్యేకంగా పరిగణిస్తాడు. తప్పదు.
వేదిక ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఎలా సమీకరించాలి. అతిథులుగా ఎవరైనా పిలవాలా వద్దా అనే అంశాల మీద దిల్ టీమ్ డిస్కషన్లో ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వేడుక జనవరి 6న ఒంగోలులో, వాల్తేరు వీరయ్య ఈవెంట్ 9న విశాఖపట్నంలో ఫిక్స్ చేశారు. అజిత్ తెగింపుకి ఏదో చిన్నగా లాగించేస్తారు కానీ వారసుడుకి మాత్రం అల్లాటప్పాగా చేస్తే కుదరదు. విజయ్ రావడం పక్కానే కానీ ఏం మాట్లాడతాడు, పబ్లిక్ కి ఏం సందేశం ఇస్తాడు, వీరయ్య వీరసింహాల ప్రస్తావన తెస్తాడా లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితి గురించి పోటీ గురించి తనకు అవగాహన ఉందో లేదో ?
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…