సంక్రాంతి పందెంలో థియేటర్ల విషయంలో సెంటర్ అఫ్ కాంట్రావర్సీగా నిలుస్తున్న వారసుడుకి ఇప్పటిదాకా తెలుగులో ఏమంత బజ్ లేదు. నిర్మాత దిల్ రాజు మంచి స్క్రీన్లను లాక్ చేస్తూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మీద వివక్ష చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తమది డబ్బింగ్ సినిమా అయినా హైప్ పెంచాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది. దానికి రెండే ఆయుధాలు. ఒకటి ట్రైలర్. రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో ఆ మధ్య ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంచనాలు పెంచడంలో అక్కడది బాగానే ఉపయోగపడింది.
కానీ విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తుపాకీ నుంచి బీస్ట్ దాకా హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నా మరీ చిరంజీవి బాలకృష్ణలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ ఎంత మాత్రం లేదు. పైగా వారసుడు స్టోరీ లైన్ మనమెన్నో సార్లు చూసిన టైపులోనే ఉంటుందని ఆల్రెడీ చెన్నై లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తే మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద చర్చ మొదలవుతుందని అంచనా. అయితే విజయ్ ఇప్పటిదాకా డబ్బింగ్ ప్రమోషన్ల కోసం ఏనాడూ హైదరాబాద్ రాలేదు. కానీ వారసుడు స్పెషల్ కేస్ కాబట్టి ప్రత్యేకంగా పరిగణిస్తాడు. తప్పదు.
వేదిక ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఎలా సమీకరించాలి. అతిథులుగా ఎవరైనా పిలవాలా వద్దా అనే అంశాల మీద దిల్ టీమ్ డిస్కషన్లో ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వేడుక జనవరి 6న ఒంగోలులో, వాల్తేరు వీరయ్య ఈవెంట్ 9న విశాఖపట్నంలో ఫిక్స్ చేశారు. అజిత్ తెగింపుకి ఏదో చిన్నగా లాగించేస్తారు కానీ వారసుడుకి మాత్రం అల్లాటప్పాగా చేస్తే కుదరదు. విజయ్ రావడం పక్కానే కానీ ఏం మాట్లాడతాడు, పబ్లిక్ కి ఏం సందేశం ఇస్తాడు, వీరయ్య వీరసింహాల ప్రస్తావన తెస్తాడా లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితి గురించి పోటీ గురించి తనకు అవగాహన ఉందో లేదో ?
This post was last modified on January 3, 2023 11:29 am
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…