పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు టాలీవుడ్లో సన్నిహితులైన వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకడు. పవన్ మీద ఈ కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ అభిమానం ఎలాంటిదో చాలా సందర్భాల్లో చూశాం. తన సోదరుడు నాగబాబు ఇబ్బందుల్లో ఉన్న స్థితిలో సాయం చేశాడన్న కృతజ్ఞతతో బండ్ల గణేష్ నిర్మాణంలో ‘తీన్ మార్’ చేశాడు పవన్. ఆ సినిమా ఆడకపోవడంతో తర్వాత ‘గబ్బర్ సింగ్’ చేశాడు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత బండ్ల.. పవన్తో సినిమా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. తనకు సినిమా దక్కకుండా చేస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాసే అన్న అసంతృప్తి బండ్లలో ఉన్నట్లు కనిపిస్తోంది.
పవన్కు సినిమాలు సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న త్రివిక్రమ్.. తనకు అవకాశం రాకుండా చేస్తున్నట్లు బండ్ల భావిస్తున్నట్లుంది. ఒక పవన్ అభిమానితో జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో త్రివిక్రమ్ను బండ్ల బూతులు తిట్టేయడం.. ఆ తర్వాత ఆ ఆడియో క్లిప్ తనదే అని కూడా ఒప్పుకోవడం తెలిసిందే.
త్రివిక్రమ్ మీద బండ్ల తన అసంతృప్తిని తాజాగా మరో ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. త్రివిక్రమ్ పేరెత్తకుండా ‘గురూజీ’ అని సంబోధిస్తూ బండ్ల విమర్శలు చేశాడు. “నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసింది నేను. ఆయనకు విపరీతమైన టాలెంట్ ఉంది. ఈయన మామూలు మనిషి కాదురా బాబూ.. ఈయన అతీతమైన వ్యక్తి. వేరే స్థాయిలో ఉండాలి.. అనుకున్నది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు, బరూజీలు అని వచ్చారు తప్పితే నాకు తెలియదు అది వేరే విషయం. పక్కన పెట్టండి. నేను ఈ రోజుకు కూడా హీరోగారంటే ఒక కృతజ్ఞత ఉంటుంది. వాళ్లు నా మీద చూపించాలని నేననుకోను” అని వ్యాఖ్యానించాడు బండ్ల.
నిర్మాతగా ఒక టైంలో వరుసగా సినిమాలు చేసిన బండ్ల.. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ప్రొడక్షన్ కొనసాగించాలని భావించిన బండ్ల.. తిరిగి పవన్ దగ్గరికే వెళ్లాడు. పవన్ సినిమా చేస్తానన్నాడు కానీ.. బండ్లకు కాల్ షీట్లు ఇచ్చే ఖాళీ దొరకట్లేదు. ఐతే పవన్ తనకు సినిమా చేయకుండా ఆపుతున్నది త్రివిక్రమే అన్న అనుమానం బండ్లలో బలంగా ఉన్నట్లుంది.
This post was last modified on January 2, 2023 2:10 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…