పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు టాలీవుడ్లో సన్నిహితులైన వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకడు. పవన్ మీద ఈ కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ అభిమానం ఎలాంటిదో చాలా సందర్భాల్లో చూశాం. తన సోదరుడు నాగబాబు ఇబ్బందుల్లో ఉన్న స్థితిలో సాయం చేశాడన్న కృతజ్ఞతతో బండ్ల గణేష్ నిర్మాణంలో ‘తీన్ మార్’ చేశాడు పవన్. ఆ సినిమా ఆడకపోవడంతో తర్వాత ‘గబ్బర్ సింగ్’ చేశాడు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత బండ్ల.. పవన్తో సినిమా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. తనకు సినిమా దక్కకుండా చేస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాసే అన్న అసంతృప్తి బండ్లలో ఉన్నట్లు కనిపిస్తోంది.
పవన్కు సినిమాలు సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న త్రివిక్రమ్.. తనకు అవకాశం రాకుండా చేస్తున్నట్లు బండ్ల భావిస్తున్నట్లుంది. ఒక పవన్ అభిమానితో జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో త్రివిక్రమ్ను బండ్ల బూతులు తిట్టేయడం.. ఆ తర్వాత ఆ ఆడియో క్లిప్ తనదే అని కూడా ఒప్పుకోవడం తెలిసిందే.
త్రివిక్రమ్ మీద బండ్ల తన అసంతృప్తిని తాజాగా మరో ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. త్రివిక్రమ్ పేరెత్తకుండా ‘గురూజీ’ అని సంబోధిస్తూ బండ్ల విమర్శలు చేశాడు. “నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసింది నేను. ఆయనకు విపరీతమైన టాలెంట్ ఉంది. ఈయన మామూలు మనిషి కాదురా బాబూ.. ఈయన అతీతమైన వ్యక్తి. వేరే స్థాయిలో ఉండాలి.. అనుకున్నది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు, బరూజీలు అని వచ్చారు తప్పితే నాకు తెలియదు అది వేరే విషయం. పక్కన పెట్టండి. నేను ఈ రోజుకు కూడా హీరోగారంటే ఒక కృతజ్ఞత ఉంటుంది. వాళ్లు నా మీద చూపించాలని నేననుకోను” అని వ్యాఖ్యానించాడు బండ్ల.
నిర్మాతగా ఒక టైంలో వరుసగా సినిమాలు చేసిన బండ్ల.. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ప్రొడక్షన్ కొనసాగించాలని భావించిన బండ్ల.. తిరిగి పవన్ దగ్గరికే వెళ్లాడు. పవన్ సినిమా చేస్తానన్నాడు కానీ.. బండ్లకు కాల్ షీట్లు ఇచ్చే ఖాళీ దొరకట్లేదు. ఐతే పవన్ తనకు సినిమా చేయకుండా ఆపుతున్నది త్రివిక్రమే అన్న అనుమానం బండ్లలో బలంగా ఉన్నట్లుంది.
This post was last modified on January 2, 2023 2:10 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…