నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ కమర్షియల్ మాస్ మూవీ ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12 న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ , గ్లిమ్స్ , సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా విషయంలో అందరికీ ఉన్న డౌట్ గోపీచంద్ మాలినేని. ఫస్ట్ టైమ్ బాలయ్యతో సినిమా చేశాడు గోపీచంద్. అసలు బాలయ్య ఎలా డీల్ చేశాడో ఏ రేంజ్ యాక్షన్ చూపిస్తాడో అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి బాలయ్య తో అదిరిపోయే మాస కంటెంట్ చూపించి మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు బోయపాటి. బాలయ్య ను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటే అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ బోయపాటి లా ఇప్పుడు గోపీచంద్ బాలయ్య ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడా ? అనే సందేహం ఫ్యాన్స్ లో నెలకొంటుంది.
ఇప్పటికే టీజర్ లో మాస్ గెటప్ , యాక్షన్ గ్లిమ్స్ చూస్తే బాలయ్య తో బ్లాక్ బస్టర్ కొడతాడనే సంకేతాలు ఇస్తున్నాడు. పైగా గోపీచంద్ లేటెస్ట్ ట్రాక్ లో వచ్చిన క్రాక్ పెద్ద హిట్టయింది. మరి బోయపాటి తర్వాత బాలయ్యతో ఆ రేంజ్ మాస్ హిట్ కొట్టే దర్శకుడిగా గోపీచంద్ పేరు వినబడుతుందా ? లేదా అనేది జనవరి 12 తెలిసిపోతుంది. అప్పటి వరకూ గోపీచంద్ మాలినేని మీద కొన్ని సందేహాలు కలగడం కామనే.
This post was last modified on January 2, 2023 12:19 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…