టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా టాలీవుడ్ సినిమా ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న Mahesh Babu రాజమౌళి కలయిక అతి త్వరలోనే కార్యరూపం దాల్చనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రచయిత విజయేంద్ర ప్రసాద్ నేతృత్వంలో దీని స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో కనివిని ఎరుగని స్థాయిలో జక్కన్న దీన్నో విజువల్ వండర్ గా చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ లో కొన్ని జంతువులకే ఊగిపోయిన జనం మూవీ మొత్తం అవే ఉంటే ఏమైపోతారో వేరే చెప్పాలా?
తాజాగా Rajamouli విజయేంద్రప్రసాద్ లు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఈ చిత్రాన్ని భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నామని చెప్పడం ఒక వైపు ఆనందాన్ని మరోవైపు టెన్షన్ ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే బాహుబలితో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ దాని కోసం ఐదేళ్లకు పైగానే త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్ కూడా ఇదే తరహాలో కమిటయితే ఆల్రెడీ రెండేళ్లకో రిలీజ్ వస్తున్న సంబరం కాస్తా మూడు నాలుగు సంవత్సరాలకు మారిపోతుంది. ఎంత జక్కన్న సినిమా అయినప్పటికీ మరీ అంత గ్యాప్ తో తమ హీరోని తెరమీద చూసుకోకుండా ఉండటం ఫ్యాన్స్ కి కష్టం కదా!
ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న మహేష్ కు ఎంతలేదన్నా వచ్చే ఆగస్ట్ దాకా దానికే సమయం సరిపోతుంది. ఆలోగా రాజమౌళి ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఆస్కార్ వేడుక జరిగే దాకా ఇంకా RRR కోసమే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ మధ్య మధ్య ఇండియా వచ్చి వెళ్తున్న జక్కన్న మహేష్ 29 మీద ఇంకా పూర్తి స్థాయి దృష్టి పెట్టలేదు. ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగిన పక్షంలో నెంబర్ మారి ఈ కాంబో కాస్తా మహేష్ 30గా మారిపోతుంది అంతే.
This post was last modified on December 31, 2022 11:46 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…