నిన్న రాత్రి స్ట్రీమింగ్ కి వచ్చేసిన మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 కొన్ని నిమిషాలకే ఆహా యాప్ ని స్థంబింపజేయడం సంచలనం రేపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు రాత్రి తొమ్మిది గంటలకు ఒకేసారి షోని చూసేందుకు లాగిన్ కావడంతో అంత కెపాసిటీ లేని ఆహా సర్వర్ లోడ్ ని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది. ప్రీమియర్ చూసేందుకు ప్లే చేసిన వాళ్ళతో పాటు అప్పటికప్పుడు చందాలు కట్టాలనుకున్న వాళ్ళ సంఖ్య లక్షలు దాటిపోయింది. ఇదంతా సెట్ చేయడానికి గంటల తరబడి సమయం పట్టడంతో సమస్య పరిష్కారానికి అర్ధరాత్రి దాటేసింది.
ఇక షో సంగతి చూస్తే ప్రభాస్ గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని హుషారుగా చిరునవ్వులతో బాలయ్య హుషారుని తోడుగా చేసుకుని ఆద్యంతం రక్తి కట్టించాడు. ముఖ్యంగా మేడం టాపిక్ మీద చాలా సేపు చర్చ జరిగింది. కృతి సనన్ పేరు ఫోటోని డైరెక్ట్ గా చూపించేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిన్నపాటి షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా ఫొటోలో ఇతర ఆర్టిస్టులను కట్ చేసి సృష్టించిన ఎడిటని అసలు మ్యాటరేంటో ఆమె చెప్పింది కదాని డార్లింగ్ స్పష్టత ఇచ్చాడు. అయినా వదలకుండా వ్యవహారం రామ్ చరణ్ కు ఫోన్ చేసే దాకా తీసుకెళ్లారు బాలయ్య. ఇక్కడ ఇంకో మలుపు
ప్రభాస్ కి బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన చరణ్ ఆ తర్వాత మాట మార్చేసి త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడని ఇంకో ట్విస్టు ఇవ్వడం ఊహించనిది. ఆమె రెడ్డినా శెట్టినా సననా అంటూ పలు ఇంటి పేర్లు ప్రస్తావించిన బాలయ్య ఎంత కవ్వించినా సరే డార్లింగ్ మాత్రం టెంప్ట్ కాకుండా ఏమి లేదు అంటూ నవ్వుతూ దాటవేశాడు. టాపిక్ అయితే ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాతి భాగంలో గోపీచంద్ కూడా దీనికి సంబంధించి ఏదో చెప్పబోతున్నాడు. అది తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం చేసుకుంటానన్న ప్రభాస్ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
This post was last modified on December 30, 2022 2:12 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…