నిన్న రాత్రి స్ట్రీమింగ్ కి వచ్చేసిన మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 కొన్ని నిమిషాలకే ఆహా యాప్ ని స్థంబింపజేయడం సంచలనం రేపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు రాత్రి తొమ్మిది గంటలకు ఒకేసారి షోని చూసేందుకు లాగిన్ కావడంతో అంత కెపాసిటీ లేని ఆహా సర్వర్ లోడ్ ని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది. ప్రీమియర్ చూసేందుకు ప్లే చేసిన వాళ్ళతో పాటు అప్పటికప్పుడు చందాలు కట్టాలనుకున్న వాళ్ళ సంఖ్య లక్షలు దాటిపోయింది. ఇదంతా సెట్ చేయడానికి గంటల తరబడి సమయం పట్టడంతో సమస్య పరిష్కారానికి అర్ధరాత్రి దాటేసింది.
ఇక షో సంగతి చూస్తే ప్రభాస్ గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని హుషారుగా చిరునవ్వులతో బాలయ్య హుషారుని తోడుగా చేసుకుని ఆద్యంతం రక్తి కట్టించాడు. ముఖ్యంగా మేడం టాపిక్ మీద చాలా సేపు చర్చ జరిగింది. కృతి సనన్ పేరు ఫోటోని డైరెక్ట్ గా చూపించేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిన్నపాటి షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా ఫొటోలో ఇతర ఆర్టిస్టులను కట్ చేసి సృష్టించిన ఎడిటని అసలు మ్యాటరేంటో ఆమె చెప్పింది కదాని డార్లింగ్ స్పష్టత ఇచ్చాడు. అయినా వదలకుండా వ్యవహారం రామ్ చరణ్ కు ఫోన్ చేసే దాకా తీసుకెళ్లారు బాలయ్య. ఇక్కడ ఇంకో మలుపు
ప్రభాస్ కి బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన చరణ్ ఆ తర్వాత మాట మార్చేసి త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడని ఇంకో ట్విస్టు ఇవ్వడం ఊహించనిది. ఆమె రెడ్డినా శెట్టినా సననా అంటూ పలు ఇంటి పేర్లు ప్రస్తావించిన బాలయ్య ఎంత కవ్వించినా సరే డార్లింగ్ మాత్రం టెంప్ట్ కాకుండా ఏమి లేదు అంటూ నవ్వుతూ దాటవేశాడు. టాపిక్ అయితే ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాతి భాగంలో గోపీచంద్ కూడా దీనికి సంబంధించి ఏదో చెప్పబోతున్నాడు. అది తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం చేసుకుంటానన్న ప్రభాస్ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
This post was last modified on December 30, 2022 2:12 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…