కొన్ని సినిమాలు థియేటర్లలో సోసోగా ఆడి వెళ్లిపోతుంటాయి. కానీ ఓటీటీలోకి వచ్చాక వాటిని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. వాటికి గొప్ప ఆదరణ కట్టబెడుతుంటారు. గత రెండు మూడేళ్లలో ఈ కోవలో చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి చేరిన సినిమా.. Masuda.
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న యువ నిర్మాత రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఇదొక హార్రర్ మూవీ. ఐతే రెగ్యులర్గా చూసే హార్రర్ సినిమాలకు కొంచెం భిన్నంగా సాగిందిది. ఒక ముస్లిం మంత్రగత్తె దయ్యం రూపంలో వచ్చి ఒక అమ్మాయిని పీడించడం.. దాని విరుగుడు కోసం ఆమె తల్లి, వీరి కుటుంబానికి సన్నిహితుడైన ఓ కుర్రాడు కలిసి పోరాడే క్రమంలో కథ నడుస్తుంది.
హార్రర్ సినిమాను కామెడీతో చెడగొట్టకుండా.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్తో ఎక్కడా ఇంటెన్సిటీ తగ్గకుండా ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు సాయికిరణ్. ఐతే పేరున్న కాస్టింగ్ లేకపోవడం వల్లో ఏమో ఈ చిత్రం థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఐతే ఇటీవలే ఈ చిత్రాన్ని Aha ఓటీటీలో రిలీజ్ చేశారు.
సినిమాకు మంచి రివ్యూలు, టాక్ ఉండడంతో ఇక్కడ ప్రేక్షకులు ‘మసూద’ను విరగబడి చూస్తున్నారు. అప్పుడే ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను పూర్తి చేసుకుంది. పెద్ద పెద్ద సినిమాలకు వచ్చే రేంజ్ వ్యూయర్ షిప్ ఇది. దీన్ని బట్టి ‘మసూద’ ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. థియేటర్లలో చూసిన వాళ్లు సినిమా జస్ట్ బాగుందని మాత్రమే అన్నారు. కానీ ఓటీటీలో చూస్తన్న జనాలు మాత్రం ఈ చిత్రాన్ని ఒక రేంజిలో పొగుడుతున్నారు. కొత్తగా ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘మసూద’కు సీక్వెల్ తీయాలని చూస్తున్న చిత్ర బృందానికి ఇది మంచి ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on December 29, 2022 11:53 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…