Kushi
ఇంకో మూడు రోజుల్లో ‘Kushi’ సినిమా రీరిలీజ్ సందడితో తెలుగు రాష్ట్రాలు ఊగిపోనున్నాయి. Pawan Kalyan కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, అలాగే కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా కావడం.. ఫ్యాన్ మూమెంట్స్, అదిరిపోయే పాటలు, ఫైట్లు ఉన్న సినిమా కావడం.. స్వయంగా నిర్మాత ఎ.ఎం.రత్నమే రంగంలోకి దిగి సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘Kushi’ స్పెషల్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ‘Jalsa’ లాంటి యావరేజ్ మూవీకే అంత హంగామా చేసిన పవన్ ఫ్యాన్స్ ‘Kushi’కి ఇంకెంత చేస్తారో అన్న చర్చ నడుస్తోంది. ఐతే ఇలా పాత సినిమాలు రీ రిలీజ్ అయినపుడు.. ఆటోమేటిగ్గా యుఎస్లో కూడా షోలు పడుతుంటాయి.పోకిరి, జల్సా, చెన్నకేశవ రెడ్డి సినిమాలకు అక్కడ పెద్ద స్థాయిలోనే షోలు వేశారు. కానీ ‘Kushi’కి మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు.
యుఎస్లోని ఏ థియేటర్ కూడా ‘Kushi’ స్పెషల్ షోలు ప్రదర్శించడానికి ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇంతకుముందు సినిమాల రీ రిలీజ్ టైంలో అభిమానులు అతి చేయడం.. థియేటర్లు దెబ్బ తినడం.. వేరే షోలకు చాలా ఇబ్బంది ఎదురు కావడమే ఇందుకు కారణమట. మన దగ్గర కూడా ఈ రిరిలీజ్ల టైంలో కొన్ని థియేటర్లు ధ్వంసమై లక్షల్లో నష్టం రావడం తెలిసిందే.
ఐతే ఇక్కడైతే చెల్లిపోయింది కానీ.. యుఎస్లో ఎగ్జిబిటర్లకు ఒళ్లు మండినట్లుంది. అందుకే ‘Kushi’ స్పెషల్ షోలకు స్క్రీన్లు ఇవ్వడానికి నిరాకరించారట. దీంతో Pawan Kalyan అభిమానులకు తీవ్ర నిరాశ తప్పట్లేదు. చివరి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ థియేటర్ల యాజమాన్యాలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఏపీలో కాకినాడ లాంటి చోట్ల కూడా ఈ స్పెషల్ షోలు ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అభిమానుల సంబరాలు శ్రుతి మించకుండా చూసుకోకుండా మున్ముందు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు.
This post was last modified on December 28, 2022 4:09 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…