మెగాస్టార్ Chiranjeevi పెద్ద మాస్ హీరోయే కానీ.. కామెడీ పండించడంలో ఆయన పెద్ద పెద్ద కమెడియన్లకు ఏమాత్రం తీసిపోరు. చంటబ్బాయి, అన్నయ్య, శంకర్ దాదా లాంటి సినిమాలు చూస్తే చిరు ఏ రేంజిలో కామెడీ చేయగలరో అర్థం అవుతుంది.
వీటన్నింట్లో కూడా ‘అన్నయ్య’ సినిమా చాలా ప్రత్యేకం. అందులో చూడ్డానికి రఫ్గా కనిపించినప్పటికీ.. హీరోయిన్ సౌందర్యను చూడగానే సిగ్గు మొగ్గలైపోయే పాత్రను చిరు పండించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ కామెడీ టైమింగ్ ఇంకెవరికీ సాధ్యం కాదు అనిపిస్తుంది ఆ సన్నివేశాలు చూస్తుంటే. ఐతే బయట కూడా చిరు అప్పుడప్పుడూ ఇదే టైమింగ్ను చూపిస్తుంటాడు. వేదికల మీద హీరోయిన్ల గురించి మాట్లాడేటపుడు ఆయన చిలిపితనాన్నంతా చూపించేస్తుంటాడు.
తన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా చిరు తన కొంటెతనాన్ని చూపించాడు. ఈ సినిమాలో Urvashi Rautelaతో చిరు ‘బాస్ పార్టీ’ అనే పాట చేసిన సంగతి తెలిసిందే., ఈ పాట గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. పాట భలే వచ్చింది, ఇంత ఊపున్న పాటలో ఎవరిని పెడుతున్నారని అడిగితే ఊర్శశి పేరు చెప్పారని.. తాను ఓకే అన్నానని, ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని అన్నాడు చిరు.
ఆయన ఊర్వశి గురించి మాట్లాడుతుండగా.. ఆమె దగ్గరికి వచ్చింది. చిరు ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ మెలికలు తిరిగేశాడు. అచ్చంగా ‘అన్నయ్య’ సినిమాలో సౌందర్యతో టచింగ్స్ అయినపుడు సిగ్గు మొగ్గలైపోయే హావభావాన్ని రిపీట్ చేశాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాక చెయ్యి అతుక్కుపోయిందంటూ గట్టిగా లాగినట్లు చేతిని వెనక్కి తీసుకోవడం విశేషం. దీంతో వేదిక మీదున్న వాళ్లు.. కిందున్న విలేకరులు గొల్లుమన్నారు. ఇంతలో రాజేంద్రప్రసాద్ వచ్చి చిరును పక్కకు పిలిచి మంచి నీళ్లు కావాలా అంటూ ఆటపట్టించడం విశేషం.
This post was last modified on December 28, 2022 11:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…