బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు సంగీత దర్శకుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతోంది. సాహో సినిమాకు ముందు శంకర్-ఎహసాన్-లాయ్లను సంగీత దర్శకులుగా ఎంచుకోవడం.. ఆ తర్వాత వాళ్లు తప్పుకోవడం.. చివర్లో హడావుడి పడి వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు చేయించి రిలీజ్ చేయడం.. వాటికి ఆశించిన స్పందన రాకపోవడం తెలిసిందే. సాహోకు ఆడియో మైనస్ అయిందన్నది స్పష్టం. ఇక ప్రభాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ విషయంలోనూ ఇదే అయోమయం కనిపిస్తోంది. సినిమా మొదలై ఏడాది దాటినా ఇంకా మ్యూజక్ డైరెక్టర్ ఖరారవ్వలేదు. ఇప్పుడు రెహమాన్తో సంప్రదింపులు జరుపుతున్నారని.. ఆయన కాదంటే తమన్తో మ్యూజిక్ చేయించుకుంటారని అంటున్నారు. ఇదెంత వరకు నిజమో చూడాలి.
ఐతే వరుసగా రెండు సినిమాల విషయంలో సంగీతం దగ్గర అయోమయ స్థితి ఎదురైన నేపథ్యంలో ప్రభాస్ తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దని అనుకుంటూ ఉంటాడనడంలో సందేహం లేదు.. ప్రభాస్ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్న నాగ్ అశ్విన్ అలాంటి సందిగ్ధతకు అవకాశం లేకుండా చూస్తున్నాడట. వీరి కలయికలో రాబోతున్న చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నట్లు సమాచారం. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న కీరవాణి ఉండగా.. ఇంకొకరు ఎందుకని నాగ్ భావిస్తున్నాడట. కీరవాణితో సంప్రదింపులు అయిపోయాయని.. ఆయన ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 18, 2020 11:45 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…