బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు సంగీత దర్శకుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతోంది. సాహో సినిమాకు ముందు శంకర్-ఎహసాన్-లాయ్లను సంగీత దర్శకులుగా ఎంచుకోవడం.. ఆ తర్వాత వాళ్లు తప్పుకోవడం.. చివర్లో హడావుడి పడి వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు చేయించి రిలీజ్ చేయడం.. వాటికి ఆశించిన స్పందన రాకపోవడం తెలిసిందే. సాహోకు ఆడియో మైనస్ అయిందన్నది స్పష్టం. ఇక ప్రభాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ విషయంలోనూ ఇదే అయోమయం కనిపిస్తోంది. సినిమా మొదలై ఏడాది దాటినా ఇంకా మ్యూజక్ డైరెక్టర్ ఖరారవ్వలేదు. ఇప్పుడు రెహమాన్తో సంప్రదింపులు జరుపుతున్నారని.. ఆయన కాదంటే తమన్తో మ్యూజిక్ చేయించుకుంటారని అంటున్నారు. ఇదెంత వరకు నిజమో చూడాలి.
ఐతే వరుసగా రెండు సినిమాల విషయంలో సంగీతం దగ్గర అయోమయ స్థితి ఎదురైన నేపథ్యంలో ప్రభాస్ తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దని అనుకుంటూ ఉంటాడనడంలో సందేహం లేదు.. ప్రభాస్ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్న నాగ్ అశ్విన్ అలాంటి సందిగ్ధతకు అవకాశం లేకుండా చూస్తున్నాడట. వీరి కలయికలో రాబోతున్న చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నట్లు సమాచారం. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న కీరవాణి ఉండగా.. ఇంకొకరు ఎందుకని నాగ్ భావిస్తున్నాడట. కీరవాణితో సంప్రదింపులు అయిపోయాయని.. ఆయన ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…