టాలీవుడ్కు 2022 సంవత్సరం పెద్ద విషాదాన్నే మిగిలిస్తోంది. నెలల వ్యవధిలో తెలుగు సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడం తెలుగు సినీ ప్రేమికులందరినీ వేదనకు గురి చేస్తోంది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు, వయసు మీద పడ్డాక, అనారోగ్య సమస్యలు తలెత్తాక ఎవ్వరైనా కాలం చేయాల్సిందే. కానీ అనారోగ్యం గురించి జనాలకు పెద్దగా సమాచారం లేని టైంలో.. ఉన్నట్లుండి దిగ్గజ నటులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడమే బాధిస్తోంది.
సెప్టెంబరు 11న కృష్ణంరాజు చనిపోవడం అందరికీ పెద్ద షాక్. ఎందుకంటే మార్చిలో ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ రిలీజైంది. ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలున్నట్లు తెలుగు కానీ.. ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు వదులుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక కృష్ణంరాజు కడసారి చూపు కోసం వచ్చిన కృష్ణ.. ఆయన మరణించిన రెండు నెలలకు తానూ వెళ్లిపోయారు. కృష్ణంరాజుతో పోలిస్తే కృష్ణది హఠాన్మరణం అనే చెప్పాలి.
ఇక సుదీర్ఘ కాలంలో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ రెండు రోజుల కిందటే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం ఆయన అభిమానులను బాధించింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతి రావు మరణించడం షాక్. చలపతి రావు ట్విట్టర్లో ఉన్న సంగతి చాలామందికి తెలియదు. చలపతిరావు తమ్మారెడ్డి పేరుతో ఆయన ట్విట్టర్లో ఉన్నారు. ఆయనకు 8 వేల మంది దాకా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆ పాతమధురాలను గుర్తు చేస్తూ అప్పుడప్పుడూ ఆయన ట్వీట్లు వేస్తుంటారు.
ఆయన సత్యనారాయణ చనిపోయిన రోజు కూడా ట్వీట్ వేశారు. నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా అంటూ కైకాలతో ఆప్యాయంగా తీయించుకున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. ఈ ట్వీట్ వేసిన ఒక్క రోజులో చలపతిరావు కూడా మరణించడం ఆయన ట్విట్టర్ ఫాలోవర్లకు పెద్ద షాక్. ఐతే తన తండ్రి చాలా ప్రశాంతంగా కన్నుమూశారని రవిబాబు చెప్పడం గమనార్హం.
This post was last modified on December 25, 2022 10:11 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…