టాలీవుడ్కు 2022 సంవత్సరం పెద్ద విషాదాన్నే మిగిలిస్తోంది. నెలల వ్యవధిలో తెలుగు సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడం తెలుగు సినీ ప్రేమికులందరినీ వేదనకు గురి చేస్తోంది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు, వయసు మీద పడ్డాక, అనారోగ్య సమస్యలు తలెత్తాక ఎవ్వరైనా కాలం చేయాల్సిందే. కానీ అనారోగ్యం గురించి జనాలకు పెద్దగా సమాచారం లేని టైంలో.. ఉన్నట్లుండి దిగ్గజ నటులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడమే బాధిస్తోంది.
సెప్టెంబరు 11న కృష్ణంరాజు చనిపోవడం అందరికీ పెద్ద షాక్. ఎందుకంటే మార్చిలో ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ రిలీజైంది. ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలున్నట్లు తెలుగు కానీ.. ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు వదులుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక కృష్ణంరాజు కడసారి చూపు కోసం వచ్చిన కృష్ణ.. ఆయన మరణించిన రెండు నెలలకు తానూ వెళ్లిపోయారు. కృష్ణంరాజుతో పోలిస్తే కృష్ణది హఠాన్మరణం అనే చెప్పాలి.
ఇక సుదీర్ఘ కాలంలో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ రెండు రోజుల కిందటే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం ఆయన అభిమానులను బాధించింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతి రావు మరణించడం షాక్. చలపతి రావు ట్విట్టర్లో ఉన్న సంగతి చాలామందికి తెలియదు. చలపతిరావు తమ్మారెడ్డి పేరుతో ఆయన ట్విట్టర్లో ఉన్నారు. ఆయనకు 8 వేల మంది దాకా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆ పాతమధురాలను గుర్తు చేస్తూ అప్పుడప్పుడూ ఆయన ట్వీట్లు వేస్తుంటారు.
ఆయన సత్యనారాయణ చనిపోయిన రోజు కూడా ట్వీట్ వేశారు. నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా అంటూ కైకాలతో ఆప్యాయంగా తీయించుకున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. ఈ ట్వీట్ వేసిన ఒక్క రోజులో చలపతిరావు కూడా మరణించడం ఆయన ట్విట్టర్ ఫాలోవర్లకు పెద్ద షాక్. ఐతే తన తండ్రి చాలా ప్రశాంతంగా కన్నుమూశారని రవిబాబు చెప్పడం గమనార్హం.
This post was last modified on December 25, 2022 10:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…