మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని దశాబ్దాల కిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక కరోనా మహమ్మారి విజృంభించిన టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల రూపాయల విరాళాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు.
కాగా భవిష్యత్తులో మరింతగా తన సేవా కార్యక్రమాలను విస్తరించాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఛారిటీ విషయమై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కృష్ణవంశీ కొత్త చిత్రం రంగమార్తాండ కోసం నేనొక నటుణ్ని అనే షాయరీకి చిరు తన గళాన్ని అందించారు.
ఈ అనుభవం గురించి మాట్లాడుతూ చిరు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ కుటుంబం గురించే ఆలోచించానని.. ఇక సమాజానికి తిరిగివ్వడం మీద దృష్టిపెడతానని చిరు వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకాలం నాకేంటి.. నా కుటుంబానికేంటి అనే ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబ సభ్యులందరూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకన్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు.
దాన్ని సమాజాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు. వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా అని చిరు పేర్కొన్నాడు. చిరు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేసినా.. ఇండస్ట్రీలో ఎంతోమందికి వ్చక్తిగత సాయాలు చేసినా సరే.. ఇప్పుడు కొత్తగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో బలంగా ఫిక్సయ్యారని.. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టబోతున్నారని స్పష్టమవుతోంది.
This post was last modified on December 25, 2022 8:21 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…