ఇండియన్ సినిమాల వసూళ్లు వేల కోట్లకు చేరుకున్నా ఇంకా వందల కోట్ల బడ్జెట్ల గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఐతే ఇప్పుడో నిర్మాణ సంస్థ ఏకంగా 3 వేల కోట్ల పెట్టుబడుల గురించి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సంచలన ప్రకటన చేసింది ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్.
కన్నడలో చిన్న సినిమాలతో మొదలుపెట్టి ‘కేజీఎఫ్’తో చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయింది హోంబలె ఫిలిమ్స్. ఈ సంస్త నుంచే వచ్చిన ‘కాంతార’ అనూహ్యంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘హోంబలె’ ప్రతిష్టను మరింత పెంచింది. దీని తర్వాత ఈ సంస్త నుంచి రానున్న ‘సలార్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంస్థ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో తమ సంస్థ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబలె ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ ప్రకటించాడు.
కేవలం కన్నడలో కాకుండా దక్షిణాదిన అన్ని భాషల్లోనూ హోంబలె ఫిలిమ్స్ రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించనుందని విజయ్ తెలిపాడు. భవిష్యత్తులో ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరింతగా విస్తరిస్తుందని, అభివృద్ధి చెందుతుందని.. అందుకే తాము నిర్మాణాన్ని కూడా విస్తరిస్తున్నామని విజయ్ తెలిపాడు.
“వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. ప్రతి సంవత్సరం ఐదారు సినిమాలు నిర్మిస్తాం. అందులో ఒకటి ఈవెంట్ ఫిలిం ఉంటుంది. విభిన్న కథలను తెరపైకి తేవాలనుకుంటున్నాం. ప్రధానంగా దక్షిణాది భాషల్లో సినిమాలు నిర్మిస్తాం. కాంతార తరహాలో మన సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంలో అవి ఉండేలా చూసుకుంటాం. కానీ అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చేలా ఆ సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇండియన్ ఎకానమీకి కూడా మా వంతుగా తోడ్పాటు అందించాలనుకుంటున్నాం” అని విజయ్ ప్రకటించాడు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…