కెజిఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్స్ తో శాండల్ వుడ్ స్థాయి అమాంతం పెరిగిపోయిందని అక్కడి సినిమా ప్రేమికులు సంతోషపడుతున్న సమయంలో ఒక స్టార్ హీరో మీద పబ్లిక్ గా చెప్పుతో దాడి చేసిన ఘటన కన్నడ పరిశ్రమను ఊపేస్తోంది. దర్శన్ మనకూ అంతో ఇంతో సుపరిచితుడే. ఆ మధ్య రాబర్ట్ అనే ప్యాన్ ఇండియా మూవీ వచ్చింది కదా ఆ హీరోనే ఇతను. మనకు రవితేజ ఎలానో బెంగళూరు సైడ్ తనకో ఆ రేంజ్ లో పెద్ద మార్కెట్ ఉంది. త్వరలో క్రాంతిని భారీ ఎత్తున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. దీని ప్రమోషన్లు జరుగుతున్నాయి
అందులో భాగంగా దర్శన్ హొస్పెట్ వెళ్ళాడు. అక్కడో వ్యక్తి అందరూ చూస్తుండగానే స్టేజి మీద మాట్లాడుతున్న దర్శన్ మీదకు చెప్పు విసిరాడు. అది నేరుగా అతని భుజాల మీద పడి దాదాపు చెంపను తాకినంత పని చేసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరి పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. అప్పటికే రక్షణగా ఉన్న బలగాలు చాలక అదనపు ఫోర్స్ ని పిలిపించాల్సి వచ్చింది. ఆ చెప్పు వేసిన వ్యక్తిని దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానిగా గుర్తించి ఆ మేరకు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. సంఘటన జరిగిన సమయంలోనే వాడికి దేశశుద్ది జరిగిపోయింది.
గతంలో దర్శన్ ఓ ఇంటర్వ్యూలో పునీత్ గురించి చేసిన వ్యాఖ్యలు, అతను బ్రతికున్నపుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగిన వివాదాలు ఇప్పుడీ పరిణామాలకు దారి తీశాయి. ఈగ విలన్ సుదీప్ ట్విట్టర్ లో దీని గురించి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ ఇలాంటివి చేయొద్దని పిలుపునిచ్చాడు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం ఖండించారు. దర్శన్ మాత్రం ఎలాంటి ఉద్రేకానికి గురవ్వొద్దంటూ శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శన్ లైట్ బాయ్ గా రాజ్ కుమార్ ఫ్యామిలీ బ్యానర్ లోనే పని చేస్తూ ఇక్కడిదాకా ఎదిగాడు. మాస్ లో ఫాలోయింగ్ పెరిగాక ఇలాంటి కాంట్రావర్సిలు పెరిగాయి. క్రాంతి జనవరి 26 రిలీజ్ కానుంది
This post was last modified on December 20, 2022 1:27 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…