కెజిఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్స్ తో శాండల్ వుడ్ స్థాయి అమాంతం పెరిగిపోయిందని అక్కడి సినిమా ప్రేమికులు సంతోషపడుతున్న సమయంలో ఒక స్టార్ హీరో మీద పబ్లిక్ గా చెప్పుతో దాడి చేసిన ఘటన కన్నడ పరిశ్రమను ఊపేస్తోంది. దర్శన్ మనకూ అంతో ఇంతో సుపరిచితుడే. ఆ మధ్య రాబర్ట్ అనే ప్యాన్ ఇండియా మూవీ వచ్చింది కదా ఆ హీరోనే ఇతను. మనకు రవితేజ ఎలానో బెంగళూరు సైడ్ తనకో ఆ రేంజ్ లో పెద్ద మార్కెట్ ఉంది. త్వరలో క్రాంతిని భారీ ఎత్తున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. దీని ప్రమోషన్లు జరుగుతున్నాయి
అందులో భాగంగా దర్శన్ హొస్పెట్ వెళ్ళాడు. అక్కడో వ్యక్తి అందరూ చూస్తుండగానే స్టేజి మీద మాట్లాడుతున్న దర్శన్ మీదకు చెప్పు విసిరాడు. అది నేరుగా అతని భుజాల మీద పడి దాదాపు చెంపను తాకినంత పని చేసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరి పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. అప్పటికే రక్షణగా ఉన్న బలగాలు చాలక అదనపు ఫోర్స్ ని పిలిపించాల్సి వచ్చింది. ఆ చెప్పు వేసిన వ్యక్తిని దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానిగా గుర్తించి ఆ మేరకు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. సంఘటన జరిగిన సమయంలోనే వాడికి దేశశుద్ది జరిగిపోయింది.
గతంలో దర్శన్ ఓ ఇంటర్వ్యూలో పునీత్ గురించి చేసిన వ్యాఖ్యలు, అతను బ్రతికున్నపుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగిన వివాదాలు ఇప్పుడీ పరిణామాలకు దారి తీశాయి. ఈగ విలన్ సుదీప్ ట్విట్టర్ లో దీని గురించి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ ఇలాంటివి చేయొద్దని పిలుపునిచ్చాడు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం ఖండించారు. దర్శన్ మాత్రం ఎలాంటి ఉద్రేకానికి గురవ్వొద్దంటూ శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శన్ లైట్ బాయ్ గా రాజ్ కుమార్ ఫ్యామిలీ బ్యానర్ లోనే పని చేస్తూ ఇక్కడిదాకా ఎదిగాడు. మాస్ లో ఫాలోయింగ్ పెరిగాక ఇలాంటి కాంట్రావర్సిలు పెరిగాయి. క్రాంతి జనవరి 26 రిలీజ్ కానుంది
This post was last modified on December 20, 2022 1:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…