వరల్డ్ సినిమాలో బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్టు తీస్తే అందులో కచ్చితంగా ఉండే చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్లో ఇప్పటిదాకా ఆరు సినిమాలు రాగా.. అన్నీ బ్లాక్బస్టర్లే. ఈ యాక్షన్ చిత్రాలతో టామ్ క్రూజ్కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. స్టంట్స్ విషయంలో అతను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలతో. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనుకరించే ప్రయత్నం చేశారు. యాజిటీజ్ కాపీ కొట్టాలని కూడా చూశారు. కానీ టామ్ క్రూజ్ మ్యాజిక్ను రీక్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు.
ఐతే ఇప్పటిదాకా అతను చేసిన స్టంట్ విన్యాసాలన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్లో రానున్న కొత్త చిత్రం ‘డెడ్ రాకెనింగ్ పార్ట్-1’ కోసం చేసిన విన్యాసం మరో ఎత్తు. ఇప్పుడు వరల్డ్ వైడ్ సినీ ప్రేమికుల చర్చలన్నీ ఈ స్టంట్ చుట్టూనే తిరుగుతున్నాయి.
ఇటీవలే ‘అవతార్-2’ సినిమా విడుదల సందర్భంగా ఐమాక్స్ స్క్రీన్లలో త్రీడీ వెర్షన్లో ‘మిషన్ ఇంపాజిబుల్-7’ కోసం క్రూజ్ చేసిన విన్యాసం తాలూకు వీడియోను రిలీజ్ చేశారు. అది చూసి ప్రేక్షకులు ఎందుకంత ఎగ్జైట్ అవుతూ పోస్టులు పెట్టారో.. ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజైన ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది.
ఒక కొండ మీద భారీ రెయిలింగ్ ఏర్పాటు చేసి, దాని మీద స్పోర్ట్స్ బైకేసుకుని రయ్యిన దూసుకెళ్లి వందల అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూకే ఈ సన్నివేశాన్ని డూప్ లేకుండా, రియలిస్టిగ్గా టామ్ క్రూజ్ చేసిన తీరుకు ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. అతడి స్థానంలో మనం ఎలా ఉంటుందన్న ఊహ కూడా షేక్ చేసేస్తుంది. దీని కోసం క్రూజ్ చేసిన రిహార్సల్స్, పడ్డ కష్టం అంతా కూడా ఈ వీడియోలో చూపించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి పర్ఫెక్ట్గా ఈ మైండ్ బ్లోయింగ్ స్టంట్ను పూర్తి చేసిన విధానం కళ్లు చెదిరిపోయేలా ేచేసేదే. ఈ వీడియో చేశాక ఇంత సాహసం చేసే హీరో టామ్ క్రూజ్ మాత్రమే అని ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on December 20, 2022 1:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…