తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తుతో గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల కిందట మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ‘మీ టూ’ మూమెంట్ మొదలైనపుడు మొదటిసారిగా వైరముత్తు మీద తీవ్ర ఆరోపణలు చేసింది చిన్మయి. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఆయన్ని కలిసినపుడు తనను లైంగికంగా లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నించాడని.. ఆయన ఎందరో అమ్మాయిలకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. కాకపోతే వీటికి సాక్ష్యాలేమీ చూపించలేని నిస్సహాయతను ఆమె వ్యక్తం చేసింది.
వైరముత్తు మీద మహిళా కమిషన్కు కంప్లైంట్లు కూడా చేసిన ఆమె తనకు న్యాయం జరగట్లేదంటూ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. సందర్భం వచ్చినపుడల్లా వైరముత్తు వ్యవహారాల గురించి ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంది. ఐతే ఒక దశ తర్వాత ఈ వ్యవహారం జనాలకు మొహం మొత్తేసిందో ఏమో.. పట్టించుకోవడం మానేశారు. కానీ చిన్మయి మాత్రం పోరాటం ఆపలేదు.
మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి వైరముత్తు మీద మళ్లీ పడింది చిన్మయి. కోలీవుడ్కు చెందిన అర్చన అనే యువ నటి.. తాజాగా వైరముత్తును కలిసిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. అర్చన తలపై చేయి పెట్టి మాట్లాడుతున్న, అలాగే ఆమె పక్కన నిల్చున్న వైరముత్తును ఉద్దేశించి చిన్మయి హెచ్చరికలు జారీ చేసింది.
‘‘ముందు ఇలాగే మొదలవుతుంది. ఆయన గొప్ప వ్యక్తి లాగే వ్యవహరిస్తాడు. దయచేసి అప్రమత్తంగా ఉండు. వీలైనంతగా దూరం పెట్టు. అలాగే నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయన్ని కలవకు’’ అంటూ కామెంట్ చేసింది చిన్మయి. వైరముత్తు చేసే లైంగిక వేధింపులకు సంబంధించి సాక్ష్యాలేమీ చూపించలేకపోయినా.. ఆయన మీద ఇలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ఆయన మీద జనాలకు సందేహాలు కలిగేలా చేయడంలో మాత్రం చిన్మయి విజయవంతం అయిందనే చెప్పాలి.
This post was last modified on December 19, 2022 8:17 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…